
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫతుల్లగూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సహా పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన నదిగా మూసీ నది ఉండేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మూసీ నది మురికికూపంగా మారిం ది. మూసీ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని.. అక్టోబర్ చివరి నాటికి నీటి శుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు. నిధులు పెరిగినా పరవాలేదు... హ...