
మధ్యప్రదేశ్ లో దారుణం.. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని దాడి..
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసు ఉపసంహరించుకోకపోవడంతో బాధిత కుటుంబంలో ఓ యువకుడిని నిందితులు హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిని వివస్త్ర ను చేశారు.
తనపై లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోకపోవడంతో ఓ నిందితులు బాధితులపై కక్ష పెంచుకున్నాడు. కేసు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. ఈక్రమంలో నిందితుడు బాధితురాలి సోదరుడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన అతడి తల్లిని వివస్త్రను చేసి దాడిచేశాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
2019లో బాధితురాలి సోదరి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ బాధితులతో వాగ్వాదం చేశాడు. కేసును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు బాధితుడు.. 18 ఏళ్ల నితిన్ అహిర్వార్ను కొట్టి ...