
Illegal immigrant : గుజరాత్లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!
Ahmadabad : జమ్మూ కశ్మీర్లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్ బ్రాంచ్ అధ్వర్యంలో క్షుణ్ణంగా అనువణువు సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విచారణ అనంతరం వారివారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్ - బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ మీడియాకు వెల్లడించారు.అహ్మదాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను (Illegal immigrant) పట్టుకోవడానికి ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్...