Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Jagannath Rath Yatra

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..
National

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత‌మైన‌ హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భ‌క్తులు తరలివస్తారు. జగన్నాథ దేవాలయం నుంచి.. దేవతలు జన్మించినట్లు విశ్వసించే గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని ర‌థ‌యాత్ర‌గా తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్ర 2024 తేదీ, స‌మ‌యం.. జూన్ లేదా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది జూలై 7న ఉదయం 4:26 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది, ఈ ఉత్సవం జూలై 16, 2024న జరిగే బహుద యాత్రతో ముగుస్తుంది. పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 శుభ తిథి పూరీ జగన్నాథ రథయాత్ర‌ ఆదివారం, జూలై 7, 2024న జ‌రుగుతుంది. ఆషాడ మాసంలోని శుక్ల పక్షంలో తిథిగా జరుపుకుంటారు. ద్వితీయ తిథి ఉదయం 04:26 గంటలక...
Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా
Trending News

Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ‌ రథయాత్ర పూరీ క్షేత్రం స‌న్న‌ద్ధమవుతోంది. ర‌థ‌యాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. జూలై 7న జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రథయాత్రకు హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము అయితే ఈసారి రథయాత్ర ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది రథయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేయడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగ...
జూన్ 20న జగన్నాథ రథయాత్ర
Telangana

జూన్ 20న జగన్నాథ రథయాత్ర

ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad's Shree Jagannath Rath Yatra :  హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు. అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం...