
Zero Interest loans | మహిళలకు గుడ్ న్యూస్.. పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు..
Zero Interest loans : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందిరా క్రాంతి పథకాన్ని(Indira Kranthi Scheme) మార్చి 12న ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి గాను మహిళలకు వడ్డీ లేని రుణాలు (zero interest loans) అందిస్తామని తెలిపారు.
రైతు బంధుపై ఏం చెప్పారంటే..
రైతు బంధు (Rythu Bandhu Scheme) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ బీఆర్ ఎస్ కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలు, కొండలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వవద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి ర...