
Ajit Doval | సురక్షితమైన సరిహద్దులతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: అజిత్ దోవల్
BSF 21st investiture ceremony | గత 10 సంవత్సరాలలో మన దేశ శక్తి అపారంగా పెరిగిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తన 21వ ఇన్వెస్టిట్యూర్ వేడుకలో భాగంగా రుస్తమ్జీ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. "మనకు మరింత సురక్షితమైన సరిహద్దులు ఉంటే" భారతదేశ ఆర్థిక పురోగతి చాలా వేగంగా ఉండేదని దోవల్ అన్నారు. "భవిష్యత్తులో, మన వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అవసరమైనంత సురక్షితంగా మన సరిహద్దులు ఉంటాయని నేను అనుకోను. కాబట్టి, సరిహద్దు భద్రతా దళాల బాధ్యత భారీగా పెరిగింది. సైనికులు శాశ్వతంగా 24X7 అప్రమత్తంగా ఉండాలి. మన జాతీయ ప్రయోజనాలను దేశ భద్రతను పరిరక్షించుకోవాలి. ” అని ఆయన అన్నారు.సరిహద్దులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అది "మన సార్వభౌమత్వాన్ని నిర్వచించే పరిమితి" అని అన్నారు. గత 10 సంవత్సరాలలో సరిహద్దు భద్రతపై ప్రభుత్వం ఎంతో శ్రద్ధ కనబరిచింది, ...