పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు
Operation Sindoor Live : పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam Attack) కి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, శిక్షణా శిబిరమైన మురిడ్కేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఐదుగురిలో భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో అబు జుందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా మరియు మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని ఈ రోజు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. హతమైన ఉగ్రవాదులలో పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ భారతదేశంపై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కమాండర్లు ఉన్నారు.ఆపరేషన్ సిందూర్లో మరణించిన ఐదురుగు ఉగ్రవాదులు వీరే:ముదస్సర్ ఖాదియన్ ఖాస్ (అబు జుందాల్)ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ లష్కరే తోయిబాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఉగ్రవాది మురిడ్కేలో ఉ...