
Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితులను తీసుకురావొద్దని సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాలని సూచించారు. ...