దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..
India's slowest train | భారత్ లో రైళ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి మూలను కలుపుకుంటూ వెళతాయి. పర్వతాలు, ఎడారులు, తీర ప్రాంతాల మీదుగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తాయి. అయితే ఇందులో తక్కువ దూరాలకు అలాగే సుదూర ప్రయాణాలకు రైళ్లు ఉన్నాయి. కొన్ని రైళ్లు నాన్స్టాప్గా, మరికొన్ని దాదాపు ప్రతి స్టేషన్లో ఆగుతాయి. ఇక్కడ మనం భారతదేశంలో అత్యధిక స్టాప్లు ఉన్న రైలు గురించి తెలుసుకుందాం. ఈ రైలు తన 37 గంటల ప్రయాణంలో 111 స్టేషన్లలో ఆగుతుంది. దీని వలన ప్రయాణికులు తమకు కావలసిన స్టేషన్లలో ఎక్కేందుకు దిగేందుకు వీలు కల్పిస్తుంది.
అత్యధిక సంఖ్యలో స్టాప్లతో రైలు
Train with highest number of stops : దేశంలో అత్యధిక స్టాప్లు ఉన్న రైలు హౌరా-అమృత్సర్ (Howrah-Amritsar Mail ) మెయిల్. ఇది పశ్చిమ బెంగాల్లోని హౌరా , పంజాబ్లోని అమృత్సర్ మధ్య నడుస్తుంది. హౌరా-అమృత్సర్ మెయిల్ 10, 20 లేద...