
Balochistan | పాకిస్తాన్లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు
Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్లో, క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని బందీలుగా ఉంచినట్లు BLA వెల్లడించినట్లు తెలిసింది. రైలుపై BLA భారీ కాల్పులు జరిపింది. 400 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారని సమాచారం.పాకిస్తాన్ రైల్వే నడిపే ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి, బలూచిస్తాన్లో 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.జాఫర్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి ఖైబర్ ...