
Caste Census | కులగణనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు…. ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది
Caste Census | తెలంగాణలో నవంబర్ 6 నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు మూడు వారాల పాటు కుల గణన ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. ఇది ప్రభుత్వ, స్థానిక సంస్థ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలకు వర్తిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత ఈ పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్లకు పంపించేస్తారు.
కులగణన విధుల్లో ఉపాధ్యాయయులు
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు), 3,414 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల (పీఎస్హెచ్ఎం)ను కుల గణన కోసం వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.అదనంగా, 6,256 మంది MRC సిబ్బంది, టైపిస్ట్ రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్లోని ప్రభుత్వ, MPP/ZPP మరి...