దేశంలో 20 నకిలీ యూనివర్శిటీలను ప్రకటించిన యూజీసీ
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం 20 విశ్వవిద్యాలయాలను "నకిలీ"వి అని ప్రకటించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఫేక్ సంస్థలు ఉన్నాయని, వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది.
ఈ విషయమై యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి మాట్లాడుతూ.. “యూజీసీ (University Grants Commission ) నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలు ఉన్నత విద్య కోసం గానీ, ఉద్యోగాల్లో అవకాశాల కోసం గానీ చెల్లుబాటు కావు. ఈ యూనివర్సిటీలకు ఎలాంటి డిగ్రీని అందించే అధికారం లేదు’’ అని తెలిపారు.ఢిల్లీలో ఎనిమిది "నకిలీ" విశ్వవిద్యాలయాలు ఉన్నాయి..ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (All India Institute of Public and Physical Health Sciences);
కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యా...