Wednesday, June 18Thank you for visiting

Tag: demolition

Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!

Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!

National
Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది. మసీదు నిర్మాణం చట్టవిరుద్ధమని వివిధ సంస్థలు ప్రకటించడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొన్ని హిందూ సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే..మసీదుకు సంబంధించి కొనసాగుతున్న పిటిషన్‌లో తమను పార్టీగా చేయాలంటూ స్థానికులు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. మసీదు కూల్చివేతకు అయ్యే ఖర్చును మసీదు కమిటీ సభ్యులు భరిస్తారు. ముస్లిం వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది బిఎస్ ఠాకూర్ మాట్లాడుతూ, "మసీదు పక్కన  పరిమితికి మించి ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు కమిటీ సమర్పించిన సమర్పణను కోర్టు అంగీకరించింది." తమ సొంత ఖర్చులతో కూల్చివేత చేసేందుకు కమిటీ సభ్యులకు కోర్టు రెండు నెలల గడువు ఇచ...
Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.

Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.

Telangana
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ Musi Beautification  | కాంగ్రెస్ స‌ర్కారు పేద‌ల ఇండ్ల‌ను అన్యాయంగా కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డి (kishan reddy) అన్నారు. బిజెపి (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి 10 నెల‌లు కాక‌ముందే పేదల కాల‌నీపై కన్నేసి వారి ఇండ్లను కూల్చ‌డానికి కుట్ర ప‌న్నింద‌ని విమ‌ర్శించారు. ఇండ్ల కూల్చివేతల (Demolition ) తో నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింద...
N Convention |  నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

N Convention | నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Trending News
Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ‌ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. "హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్ జోన్‌లోకి వస్తుంది" అని మాదాపూర్ డిసిపి తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చివేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా కేసు కోర్టులో ఉండ‌గా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడం స‌మంజ‌సం కాద‌న్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని స్ప‌ష్టం...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..