
గో సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad : రాష్ట్రంలో గో సంరక్షణ కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గోవులను కాపాడేందుకు వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీ ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో కూడిన కమిటీ ఈ విషయంలో లోతైన అధ్యయనం చేయాలని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో గో సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో సమీక్ష సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస...