పాకిస్తాన్కు మద్దతిచ్చిన అజర్బైజాన్, టర్కీదేశాలను బహిష్కరించాలని పిలుపు.. Boycott Turkey Azerbaijan
Boycott Turkey Azerbaijan జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. అమాయకులైన పర్యాటకులను మతం అడిగి హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాత అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి భారత వాయుసేన దీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్ తో ఏకకాలంలో 9 చోట ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. భారత్ చర్యలపై ప్రపంచం వ్యాప్తంగా మద్దతు లభించింది. కానీ ఆపరేషన్ సిందూర్ ను ఖండిస్తూ టర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ పంచన చేరాయి. తాజాగా అజర్బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ” పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం ” తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.“అంతేకాదు పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని తెలిపింది. ఈ దాడిలో అనేక పాకిస్తాన్ మంది పౌరులు మరణించారని, తాము పాక్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించింది....