
పండుగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే పలు రైళ్లకు అదనపు కోచ్ లు
South Central Railway | ప్రయాణకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని పలు కీలక మార్గాల్లో ప్రయాణించే రైళ్లకు అదనపు కోచ్ లను జోడించనున్న ట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అదనంగా కోచ్ లను జతచేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్రయాణికుల కు తాజా నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించనుంది.
ఈ రైళ్లకు ఆదనపు కోచ్ లుTirupati Trians : రైలు నం. 16057: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ జోడించనున్నారు. ఇది అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది.
రైలు నెం. 16058: తిరుపతి - డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఇవే తేదీలల...