
Operation Sindoor : ఉగ్రవాదులకు పాక్ మిలటరీ మద్దతు.. అందకే మేం దీటుగా ప్రతిస్పందించాం
India-Pakistan ceasefire Updates ఏప్రిల్ 22న జరిగిన భయంకరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరామని చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’పై నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్పై దాడుల వీడియోలను ప్రదర్శించారు. పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని అన్నారు. ఎయిర్ మార్షల్ ఎకె భారతి (డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్), లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్), వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ (డైరెక్టర్ జనరల్ నావల్ ఆపరేషన్స్) సంయుక్తంగా వరుసగా రెండో రోజు "ఆపరేషన్ సిందూర్" వివరాలను ప్రకటించారు.సమావేశంలో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టిన...
