Friday, January 23Thank you for visiting

Somnath Temple | వెయ్యేళ్ల వీరత్వానికి గుర్తుగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’

Spread the love

Somnath Swabhimaan Parv 2026 | న్యూఢిల్లీ : భారతీయ నాగ‌రిక‌త‌, సాంస్కృతిక వార‌స‌త్వ స్ఫూర్తికి సోమనాథ్ ఆలయం (Somnath Temple) ఒక సజీవ సాక్ష్యం. క్రీ.శ. 1026లో గజినీ మహమూద్ చేసిన మొదటి భారీ దాడి నుంచి 2026 నాటికి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ (1026–2026) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. సోమనాథ్ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారతదేశం యొక్క ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.

జ్యోతిర్లింగాలలో ప్రథమం:

గుజరాత్ తీరంలోని ప్రభాస్ పటాన్ వద్ద వెలసిన సోమనాథ్ స్వామి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటివారు. ఋగ్వేదం, స్కందపురాణం, శివపురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ క్షేత్రానికి సంబంధించిన అనేక ప్రాముఖ్య‌త‌లు ప్ర‌స్తావించ‌బ‌డి ఉంది. హిరణ్, కపిల, సరస్వతి నదులు అరేబియా సముద్రంలో కలిసే ‘త్రివేణి సంగమం’ వద్ద ఈ ఆలయం కొలువై ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి, చివరి యాత్ర చేసిన ‘నీజ్‌ధామ్ ప్రస్థాన్’ కూడా ఇదే కావడం విశేషం.

విధ్వంసంపై విజయం:

చరిత్రకారుల కథనం ప్రకారం, సోమనాథ్ ఆలయం అనేకసార్లు దాడులకు గురైంది. పురాణాల ప్రకారం చంద్రుడు (సోమరాజు) బంగారంతో, రావణుడు వెండితో, శ్రీకృష్ణుడు చెక్కతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

క్రీ.శ. 1026లో గజ్నీ మహమూద్, ఆ తర్వాత 1297, 1394 మరియు 1706లో ఔరంగజేబు వంటి అనేకమంది దండయాత్రలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. 1026 దాడి తర్వాత సోలంకి రాజవంశానికి చెందిన భీమ్‌దేవ్-I ఈ ఆలయాన్ని తొలిసారిగా రాతితో పునర్నిర్మించారు.

gir-somnath2-67b40a779f7d9

ఆధునిక భారత్ – సర్దార్ పటేల్ సంకల్పం

నేడు మనం చూస్తున్న 7వ ఆలయం స్వాతంత్ర్యానంతర భారత పునరుజ్జీవనానికి చిహ్నం. 1947లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పునర్నిర్మాణానికి నాంది పలికారు. కేఎం మున్షీ దీనికి పూర్తి మద్దతునివ్వగా, 1951 మే 11న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.

సోమనాథ్ ఆలయం ‘చాళుక్య’ లేదా ‘మారు-గుర్జార’ నిర్మాణ శైలిలో, కైలాస మహామేరు ప్రసాద్ పద్ధతిలో నిర్మించబడింది. నిర్మాణ లక్షణాలను ప‌రిశీలిస్తే.. ఈ ఆల‌యం 155 అడుగుల ఎత్తైన శిఖరం, గర్భగృహం, సభామండపం, నృత్యమండపాలతో ఇది అత్య‌ద్భుతంగా గంభీరంగా ఉంటుంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ శిల్పులైన ‘సోంపురా సలాత్‌లు’ వారి అద్భుత కళానైపుణ్యంతో దీనిని మలిచారు.

తీర్థ స్తంభం:

ఇక్కడి ‘అబాధిత్ సముద్ర మార్గం’ స్తంభం ప్రాచీన భారతీయుల భౌగోళిక జ్ఞానానికి నిదర్శనం. ఇక్కడి నుండి దక్షిణ ధ్రువం వరకు సముద్రం మధ్యలో ఎలాంటి భూభాగం అడ్డురాదని ఇది సూచిస్తుంది.

స్వాభిమాన సందేశం : విధ్వంసంపై సృష్టిని, మతాభిమానంపై విశ్వాసాన్ని గెలిపించిన క్షేత్రం సోమనాథ్. స్వామి వివేకానంద నుండి అహల్యాబాయి హోల్కర్ వరకు అందరూ ఈ క్షేత్రాన్ని భారతదేశ జాతీయ జీవన ప్రవాహానికి నిదర్శనంగా భావించారు. 2026 నాటి ఈ సహస్రాబ్ది మైలురాయి, గీతలో చెప్పబడిన ‘నాశనం లేని ఆత్మ’ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా ఎక్స్(ట్విట్టర్)వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *