Thursday, April 9, 2026
National

పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..

Spread the love

Bharat brand wheat flour | నిత్యావ‌స‌ర వ‌స్తువులు ఆకాశాన్నంటిన వేళ‌ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం మంగళవారం 2వ దశ కింద భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి (Bharat brand wheat flour) , బియ్యం (Rice subsidy) రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి (అట్టా) కిలో రూ.30, బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో కిలో రూ.34 చొప్పున విక్రయించనున్నారు.
ఈ సహకార సంఘాల మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్‌ఆఫ్ చేసిన అనంతరం ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి (Food Minister Pralhad Joshi)  మాట్లాడుతూ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సబ్సిడీ ధ‌ర‌ల‌కు గోధుమ పిండి, బియ్యాన్ని విక్రయిస్తున్న‌ట్లు తెలిపారు.

3 ల‌క్ష‌ల ట‌న్నుల గోధుమ‌లు

ధరల స్థిరీకరణ నిధి కింద ఫేజ్-2 రిటైల్ కోసం ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నుంచి 369,000 టన్నుల గోధుమలు, 291,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. “కేటాయింపబడిన స్టాక్ అయిపోయే వరకు ఈ విక్రయాలు కొనసాగుతాయ‌ని, త‌మ‌ వద్ద తగినంత స్టాక్ ఉంది, అవ‌స‌ర‌మైతే మళ్లీ కేటాయిస్తామని జోషి చెప్పారు.

కొత్త ధరల విధానం ప్రకారం, గోధుమ పిండి 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లలో కిలోకు రూ.30 చొప్పున అందుబాటులో ఉంటుంది. బియ్యం కిలో రూ. 34కి విక్రయించనున్నారు.ఫేజ్-1 రేట్లు రూ. 27.5, రూ. 29 నుంచి స్వల్పంగా పెరిగింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించడం, మార్కెట్‌లో ధరలను నియంత్రించడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని కేంద్ర మంత్రి జోషి తెలిపారు.

మిగులు బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధరల పటిష్టతను అర్థం చేసుకోవడానికి ఒక అధ్యయనం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు, అయితే ఆ ధరలను నిర్వహించడం “ఎక్కువగా నియంత్రణలో ఉంది”, సాధారణ నాణ్యత రకాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే ఉన్నాయి. మొద‌టి దశలో, అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు, 15.20 లక్షల టన్నుల గోధుమ పిండి, 14.58 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆహార శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ, ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా పాల్గొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *