Saturday, February 21"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

Spread the love

మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఎరండోల్ ప్రాంతంలోని పాండవ్ వాడా స్థలాలు ఇస్లామిక్ ఆక్రమణలకు గురవుతున్నాయి. పాండవులు ఎరండోల్ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో గడిపారని, ఇక్కడ నిర్మించిన హిందూ, జైన దేవాలయాల నిర్మాణాలు 800-1000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. తరువాత హిందువులలో తీవ్రమైన ఉదాసీనత కారణంగా, 125 సంవత్సరాల క్రితం ముస్లింలు పాండవ్ వాడను నెమ్మదిగా ఆక్రమించడం ప్రారంభించారు. వారు వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ చివరికి అక్కడ మసీదును నిర్మించారు.

హిందూ జనజాగృతి సమితి (HJS), పాండవ్వాడ సంఘర్ష్ సమితి వంటి హిందూ సమూహాలు పాండవ్వాడను వక్ఫ్ బోర్డు నుండి తిరిగి పొందాలని. ఆ ప్రాంతాలను
పునరుద్ధరించాలని పోరాడుతున్నాయి. వివాదాస్పద మసీదు ప్రస్తుతం 100 సంవత్సరాల ఉనికికి సంబంధించిన రికార్డులను కలిగి ఉంది. అయితే పాండవ వాడలోని ప్రధాన భవనాలు (జైన్, హిందూ దేవాలయాల శైలిలో నిర్మించబడ్డాయి) ఇవి 800-1000 సంవత్సరాల పురాతనమైనవి. ఇవి హిందూ ఆలయాలని వాటి నిర్మాణమే తేటతెల్లం చేస్తోంది.

మహాభారత ఇతిహాసంలో పేర్కొన్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా  మసీదు నిర్మించబడిందని హిందూ సంస్థలు చెబుతున్నాయి. ఇంకా, మహాభారతం, స్థానిక చరిత్రలలో వివరించిన విధంగా పాండవ్వాడ హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి వివాదాస్పద మసీదును నిర్మించడానికి అనుబంధ వక్ఫ్ కమిటీ పని చేస్తోంది.

Pandavwada Temple
Pandavwada Temple

జుమ్మా మసీదు నిర్మాణాన్ని అక్రమంగా ఎలా విస్తరించారు?

హిందూ అస్తిత్వ నివేదిక ప్రకారం, జుమ్మా మసీదు ఒకప్పుడు పాండవ వాడకు సమీపంలో, సరిగ్గా పాండవ వాడకు వెనుక ఉండేదని HJS నిపుణుల బృందం కనుగొంది. 1880  ADలో, విస్తారమైన వర్షాల కారణంగా మసీదు కూలిపోయింది. తదనంతరం, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, మసీదు నియంత్రణ ట్రస్ట్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కలప తోపాటు మేత వంటి వనరులను నిల్వ చేయడానికి ట్రస్ట్ ప్రభుత్వం నుండి 25 సంవత్సరాల కాలానికి స్థలాన్ని అద్దెకు తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక రూపాయి స్టాంప్ పేపర్ పై రాసి రెండు రూపాయల వార్షిక అద్దెగా నిర్ణయించినట్ల చెబుతారు.

ఒప్పందం కేవలం నిల్వ కోసం మాత్రమే అయినప్పటికీ, అనేక ముఖ్యమైన చారిత్రక  నిర్మాణాలు చివరికి కూల్చివేశారు. అనేక అద్భుతమైన శిల్పసంపద, పూర్వికులు చెక్కిన
రాతి స్తంభాలు, కిటికీ ఫ్రేమ్‌లు కాలిపోయాయి లేదా నాశనం చేయబడ్డాయి. 150 ఏళ్ల  నాటి చెట్లు నేలకొరిగాయి. హిందూ-జైన్ మూలాంశాలను నాశనం చేయడానికి సున్నితమైన శిల్పాలను తొలగించిన తర్వాత.. రాతి స్తంభాలు ప్లాట్‌ఫారమ్‌లు, షెల్టర్‌లను నిర్మించడానికి ఉపయోగించారు. ఉపరితలం క్రింద ఉన్న సొరంగాలు మూసివేయబడ్డాయి. పాండవ్ వాడా పురాతన స్మారక చట్టం పరిధిలోకి వచ్చిన తర్వాత హిందూ సంస్థలు దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొన్నాయి. ఎరండోల్‌కు చెందిన మామ్లెదార్‌ను మెయింటెనెన్స్ సర్వేయర్ చర్య తీసుకోవాలని ఆదేశించగా, జుమ్మా మసీదు ధర్మకర్త సందేఖాన్ రహీమాఖా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.

HJS దీనిని ‘ల్యాండ్ జిహాద్’ కేసుగా పేర్కొంది

హెచ్‌జేఎస్ మహారాష్ట్రకు చెందిన సునీల్ ఘన్‌వత్ దీనిని ‘ల్యాండ్ జిహాద్ కేసు’గా పేర్కొంటూ, “2009లో వక్ఫ్‌బోర్డులతో మొత్తం 4 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తిగా
ఉంది. కానీ, 2023 నాటికి ఆ భూములను ఏకంగా 8 లక్షల ఎకరాలకు పెంచారు. ‘‘తమిళనాడులో, గ్రామంలో ఉన్న 1500 పురాతన సుందరేశ్వర చంద్రశేఖర స్వామి
దేవాలయంతో సహా తిరుచెంతురై గ్రామం మొత్తాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. వక్ఫ్ చట్టం కారణంగా, గుజరాత్‌లోని ద్వారకా ద్వీపం, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వంటి అనేక ప్రదేశాలు, ప్రయాగ్‌రాజ్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్, వారణాసిలోని జ్ఞాన్‌వాపి, ఉత్తరప్రదేశ్‌లోని మధురలను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. ఈ వక్ఫ్ దురాక్రమణ ఆగాలి” అని అన్నారు.

కలెక్టర్ ఆర్డర్ చట్టవిరుద్ధమని వివాదాస్పద మసీదు పేర్కొంది. ఇంతలో, మసీదు రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తిపై మసీదు ఉన్నందున మసీదుకు సీలు వేయాలని కలెక్టర్ ఆదేశించడం ‘చట్టవిరుద్ధం’ అని మసీదు కమిటీ పట్టుబడుతోంది. “వక్ఫ్ ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేది వక్ఫ్ ట్రిబ్యునల్ మాత్రమే. కలెక్టర్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను దాటవేశారు’’ అని కమిటీ చెబుతోంది.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *