Friday, March 14Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

National
 వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు. మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, "మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294, 504, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ విషయాన్ని తెలుసుకొని  గ్రహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ వి...
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

National, Trending News
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని... పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది.రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన సిద్ధప్ప కుప్పకూలిప...
సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

National
గుజరాత్‌లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సింహం ఆవుపై దాడిచేసిన ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో చోటుచేసుకుందని ఆయన ట్వీట్ చేశారు. తన ఆవుపై దాడి చేస్తున్న సింహం దగ్గరికి వెళ్లి దాన్ని తరిమికొట్టడానికి యత్నించాడు. ఆ క్లిప్‌ను అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రికార్డ్ చేశాడు.సింహం ఆవు మెడను కొరికి ఎంతకీ వదలలేదు. సింహం పట్టు నుండి బయటపడేందుకు ఆవు ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఆ పెనుగులాటలో రెండు జంతువులు కూడా రోడ్డు కిందకు దిగుతుండగా అప్పుడే రైతు వస్తూ సింహాన్ని భయపెట్టేందుకు చేయి పైకెత్తి అరుస్తూ కనిపించాడు..వెంటనే రోడ్డుపై ఓ ఇటుకను తీసుకొని వేగంగా ఆవు వైపు కదిలాడు. రైతు అరుపులను చూసి సింహ...
రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు

రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు

National
 న్యూఢిల్లీ: రోడ్డు మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను (road accidents ) తగ్గించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్లపై "బ్లాక్ స్పాట్స్" తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు . ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. మనుషుల ప్రాణాలు అమూల్యమైనవని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది 18-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే ఉంటున్నారు.. ప్రమాదాల కారణంగా గాయపడినవారు వారి సంతోషకరమైన జీవితాన్ని కోల్పోతున్నారు." అని గడ్కరీ అన్నారు.అధికారిక లెక్కల ప్రకారం.. 2021లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.54...
దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!

దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!

National
ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రయాణ మార్గాల్లో మొదటిది రైల్వే మార్గం. రైలు మార్గాలు  దేశం లోని నలుమూలలా విస్తరించి ఉన్నాయి. దూర ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. అయితే రైళ్లను ప్రతీరోజు క్లీన్ గా ఉంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాకొన్ని ట్రైన్లు మాత్రం చాలా మురికిగా ఉంటున్నాయి. రైలు కోచ్‌ల అపరిశుభ్రతపై ట్విట్టర్‌తో పాటు, రైల్ మదద్ యాప్‌లో ప్రజలు భారతీయ రైల్వేలకు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న రైళ్లలో దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి తరచుగా చాలా ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ ట్రైన్ల గురించి ఇపుడు తెలుసుకుందాం..రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో 'సహర్స-అమృతసర్ గరీబ్ రథ్' ట్రైన్ పేరు అగ్ర స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుంచి సహర్సా వరకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కోచ్ నుంచి...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

National
ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం.. అక్కడికక్కడే 12 మంది మృతి..Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ...
అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు

అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు

National
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్‌పూర్, తిన్‌సుకియా, ఉదల్‌గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.వరదలు కారణంగా రహదారులు, వంతెనలు తెగిపోయాయి. 1,409 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు తుచుకుపెట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర, పుతిమరి, కోపిలి సహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.అధికారులు బిస్వనాథ్, దిబ్రూఘర్, లఖింపూర్, టిన్సుకియా, ఉదల్గురి ప్రాంతాల్లో 19 సహాయ శిబి...
24 గంటల్లో 5 భూకంపాలు

24 గంటల్లో 5 భూకంపాలు

National
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో 24 గంటల్లోనే 5 తేలికపాటి-తీవ్రత గల భూకంపాలు (five-mild-earthquakes) సంభవించాయి వీటి తీవ్రత 4.5 అని గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత మొదటి ప్రకంపనలు సంభవించాయి.జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో అనేక తక్కువ-తీవ్రత గల భూకంపాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.03 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి కొండ రాంబన్ జిల్లాలోభూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. భూకంపం లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం,...
యోగా వారోత్సవాలు ప్రారంభం

యోగా వారోత్సవాలు ప్రారంభం

National
 International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు. దినచర్యగా మారాలి లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో 'యోగ సప్తా' (యోగా వీక్) ప్రారంభ సెషన్‌లో ఆయుష్ మంత్రి దయాశంకర్ మిశ్రా అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేసే వారు అనారోగ్యానికి గురికాకుండా శారీరకంగా, మానసికంగా మెరుగవుతారని తెలిపారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. అమృత్ సరోవర్లు, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదే...
దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు

National
రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.ముంబై - గోవా వందే భారత్ (Mumbai - Goa Vande Bharat)గోవా రాష్ట్రంలో మొదటి, ముంబై లో నాల్గవ బ్లూ-వైట్ రైలు ఇది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), గోవాలోని మడ్‌గావ్ మధ్య శుక్రవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ట్రయల్ రన్ సమయంలో ఇది సుమారు ఏడు గంటల్లో 586 కి.మీ-దూరాన్ని అధిగమించింది.దాదర్, థానే, పన్వేల్, ఖేడ్, రత్నగిరి, కంకావాలి, థివిమ్ అనే ఏడు స్టేషన్లలో ఇది హాల్టిం...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?