మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది.

 

ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.

“వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్,  సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 (ముగ్గురు) ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 04 మంది (నలుగురు) వ్యక్తులను అరెస్టు చేశారు” అని మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు.

READ MORE  Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌

అంతకుముందు రోజు, హీరుమ్ హేరా దాస్, తౌబాల్ నివాసి, ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మొదటి నిందితుడు. మరికొద్ది గంటల్లో మరిన్ని అరెస్టులు జరుగుతాయని మణిపూర్ పోలీసులు తెలిపారు, నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే అత్యాచారం, హత్య సెక్షన్లను చేర్చారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈశాన్య రాష్ట్రంలోని మెయిటీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన సరిగ్గా ఒక రోజు తర్వాత మే 4న మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది .

READ MORE  ఇస్రో కౌంట్‌డౌన్‌ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..

ఎఫ్‌ఐఆర్ ప్రకారం, 800-1,000 మంది సాయుధ దుండగుల గుంపు గ్రామంపై దాడి చేసి, ఇళ్లను ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఐదుగురు వ్యక్తులతో కూడిన కుటుంబం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రామం నుండి పారిపోయి అడవిలోకి పరుగులు తీసింది. వారిని గమనించి పోలీసు బృందం రక్షించింది. అయితే, వారిని అడ్డుకున్న గుంపు ఆ ఐదుగురిని పోలీసుల నుండి దూరంగా తీసుకెళ్లారు.

ముగ్గురు మహిళల్లో తన సోదరిని రక్షించేందుకు ప్రయత్నించిన 19 యువకుడిని దుండగులు చంపేశారు. అలాగే  56 ఏళ్ల వ్యక్తిని కుడా హత్య చేసారు. వారిలో ఇద్దరిని బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించగా, 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

READ MORE  సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

స్థానికుల సాయంతో ముగ్గురు మహిళలు తప్పించుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రంలో  ‘ఉద్రిక్తతల’ కారణంగా ఆ సమయంలో కేసు బయటకు రాలేదు… ఆ గుంపు ఆధిపత్య మెయిటీ కమ్యూనిటీకి చెందినదని పేర్కొంది.

 

మణిపూర్‌లో  హింసలో 150 మందికి పైగా మరణించారు. 50,000 మందికి పైగా గాయపడ్డారు. మే 3న చురాచంద్‌పూర్‌లో కుకీ కమ్యూనిటీ మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన తర్వాత ఘర్షణలు చెలరేగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *