Thursday, April 17Welcome to Vandebhaarath

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

Spread the love

Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత‌మైన‌ హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భ‌క్తులు తరలివస్తారు. జగన్నాథ దేవాలయం నుంచి.. దేవతలు జన్మించినట్లు విశ్వసించే గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని ర‌థ‌యాత్ర‌గా తీసుకెళ్తారు.

జగన్నాథ రథయాత్ర 2024 తేదీ, స‌మ‌యం..

జూన్ లేదా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది జూలై 7న ఉదయం 4:26 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది, ఈ ఉత్సవం జూలై 16, 2024న జరిగే బహుద యాత్రతో ముగుస్తుంది.

READ MORE  మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 శుభ తిథి

పూరీ జగన్నాథ రథయాత్ర‌ ఆదివారం, జూలై 7, 2024న జ‌రుగుతుంది. ఆషాడ మాసంలోని శుక్ల పక్షంలో తిథిగా జరుపుకుంటారు. ద్వితీయ తిథి ఉదయం 04:26 గంటలకు ప్రారంభమై జూలై 8, 2024న తెల్లవారుజామున 04:59 గంటలకు ముగుస్తుంది.

పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 గురించి

Jagannath Rath Yatra 2024 : జగన్నాథ రథయాత్ర ఒడిశా పూరిలో జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ. ఇది ముగ్గురు దేవతలు – జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆక‌ర్ష‌ణీయంగా అలంక‌రించిన‌ రథాలలో కొలువుదీరి ర‌థ‌యాత్ర‌గా బ‌య‌లుదేరుతారు. దేవ‌తల ర‌థాన్ని వేలాది మంది భక్తులు లాగుతారు. ఈ వేడుక‌లు దేవతలు వారి అత్తగారి ఇల్లు అయిన గుండిచా ఆలయానికి వెళ్లే ఘట్టాన్ని సూచిస్తుంది. అక్కడ ఒక వారం పాటు ఉంటారు. ఈ పండుగ దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం హైంద‌వ గొప్ప‌త‌నాన్ని చాటుతుంది.

READ MORE  జూన్ 20న జగన్నాథ రథయాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *