Saturday, April 19Welcome to Vandebhaarath

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు

Spread the love

 

వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామని తెలిపారు.
మీడియాతో ఏఎస్పీ పాట్లే మాట్లాడుతూ, “మేము నిందితుడిని (ప్రవేష్ శుక్లా) అదుపులోకి తీసుకున్నాం. అతన్ని విచారిస్తున్నాం. విచారణ పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. కాగా నిందితుడిపై పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294, 504, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

READ MORE  Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ విషయాన్ని తెలుసుకొని  గ్రహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితులపై ఎన్‌ఎస్‌ఏ విధించాలని కూడా ఆదేశించారు. సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని విడిచిపెట్టదని, నిందితుడిని శిక్షించడం ప్రతీ ఒక్కరికీ నైతిక పాఠంగా మిగిలిపోవాలని సీఎం చౌహాన్ అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత గత మంగళవారం ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు ఓ వ్యక్తి ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు కనిపిస్తుంది. ఆ వీడి యో ఆధారంగా నిందితుడిని కుబ్రి గ్రామానికి చెందిన ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. బాధితుడిని జిల్లాలోని కరౌండి గ్రామానికి చెందిన వ్యక్తి(36) గా గుర్తించారు. అయితే  ప్రవేశ్ శుక్లా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీరిద్దరి ఫోటోను శుక్లా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. కాగా శుక్లాతో తమకు సంబంధం లేదని బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించింది.

READ MORE  మధ్యప్రదేశ్ లో దారుణం.. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని దాడి..

పలు సెక్షన్ల కింద కేసుల నమోదు

ముఖ్యమంత్రి సూచన మేరకు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 294, 504, సెక్షన్ 3(1) (r)(లు) కింద జిల్లాలోని బహారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. SC/ST చట్టం, NSA కూడా అతనిపై విధించారు.
కాగా ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. ఇది చాలా ఖండించదగిన ఘటన అని అన్నారు.

 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, ట్రెండింగ్, వైరల్ న్యూస్ అప్ డేట్స్ వార్తల కోసం వందేభారత్ (Vande Bhaarath) వెబ్ సైట్ ను
సందర్శించండి

READ MORE  Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *