నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత వారోత్సవాల్లో భాగంగా కొత్తవాడ అమరవీరుల స్థూపం నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేతన్నలు నేసిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకులు గొప్పగా మార్చుకునేందుకేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధిచిన తెలంగాణలో ఆ ఫలాలను నేడు నేతన్నలకు అందుతున్నాయన్నార...