2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు

2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు
Spread the love

డెలివరీ షెడ్యూల్ ప్రకారం, 2026 నాటికి రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన రెజిమెంట్లను భారతదేశం అందుకోనుంది. పాకిస్తాన్, చైనాతో భారత్ పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మొదటి మూడు యూనిట్లను విజయవంతంగా మోహరించిన తర్వాత ఇది జరుగుతుంది. భారతదేశంలోని రష్యన్ డిప్యూటీ రాయబారి రోమన్ బాబుష్కిన్ వార్తా సంస్థ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని ధృవీకరించారు, ఇటీవలి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ మిగిలిన వ్యవస్థలను సకాలంలో డెలివరీ చేయాలని చెప్పారు.

భారతదేశం యొక్క S-400 వ్యవస్థలు ఇప్పటికే తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో, అవి శత్రు డ్రోన్‌లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాయి. S-400 సిస్టం కోసం ఒప్పందంపై మొదట 2018లో సంతకం చేశారు. దీని విలువ $5.43 బిలియన్లు, ఇందులో ఐదు రెజిమెంట్లు ఉంటాయి. మొదటి రెజిమెంట్ డిసెంబర్ 2021లో వచ్చినప్పటికీ, రెండవ, మూడవవి వరుసగా ఏప్రిల్ 2022, అక్టోబర్ 2023లో డెలివరీ చేసింది. చివరి రెండు యూనిట్లు రాబోయే రెండు సంవత్సరాలలో డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేశారు.

భారతదేశంలో “సుదర్శన్ చక్ర” అని కూడా పిలువబడే S-400, వ్యూహాత్మక బాంబర్లు, ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు, క్షిపణులు వంటి వివిధ రకాల వైమానిక ముప్పులను గుర్తించి నాశనం చేయగలదు. ఇవి 380 కిలోమీటర్ల వరకు గుర్తించే రేంజ్ ను కలిగి ఉంటాయి. దీని శక్తివంతమైన రాడార్, క్షిపణి లాంచర్లు, కమాండ్ సెంటర్ దీనిని ఒకేసారి అనేక‌ర కాల‌ ముప్పులను లక్ష్యంగా చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి, దీని వలన భారతదేశం దాని వైమానిక రక్షణ సామర్థ్యాలు రెట్టింప‌య్యాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version