Wednesday, March 5Thank you for visiting

Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ లో అంతర్భాగమే.. అమెరికా ప్రకటన.. చైనాకు షాక్..

Spread the love

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)ను భారత భూభాగంలో భాగంగా గుర్తిస్తోందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి “చొరబాటు లేదా ఆక్రమణలను” అమెరికా ప్రభుత్వం (United States) తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌ను “చైనా భూభాగంలో అంతర్లీన భాగం” అని పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత అమెరికా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. “అరుణాచల్ ప్రదేశ్‌ను యునైటెడ్ స్టేట్స్ భారత భూభాగంగా గుర్తిస్తుంది, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక లేదా పౌరుల ద్వారా చొరబాట్లు లేదా ఆక్రమణలను ప్రోత్స‌హించ‌డం వంటి ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము” అని పేర్కొంది.

సెలా టన్నెల్ నిర్మాణంపై అక్కసు

చైనా (China) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, జిజాంగ్ దక్షిణ భాగం (టిబెట్‌కు చైనా పేరు) చైనా భూభాగంలో అంతర్లీన భాగమని, బీజింగ్ ఎప్పుడూ “అరుణాచల్ ప్రదేశ్” అని పిలవబడే భారతదేశం అక్రమంగా స్థాపించిన “అరుణాచల్ ప్రదేశ్‌ను గుర్తించదు అని అన్నారు. ,
అరుణాచల్ ప్రదేశ్‌లోని వ్యూహాత్మక సెలా టన్నెల్ ద్వారా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ రక్షణ  చర్యకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. భారత నాయకులు ఈ భూభాగాన్ని సందర్శించిన ప్రతీసారి  చైనా వ్యతిరేకిస్తుంది. చైనా కూడా ఈ ప్రాంతానికి జంగ్నాన్ అని పేరు పెట్టింది.

చైనాకు స్ట్రాంగ్ కౌంటర్..

అయితే చైనా రక్షణ మంత్రి “అసంబద్ధమైన వాదనలను” గమనించిన భారత్..  అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగమని మంగళవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ‘జాంగ్నాన్స్ దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న వాద‌న‌ను ప్రతిస్పందనగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్  చైనా వాదనను “అసంబద్ధం” అని తోసిపుచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ “భారతదేశంలో అంతర్భాగమ‌ని, విడదీయరాని భాగం” అని పునరుద్ఘాటించారు. “ఈ విషయంలో నిరాధారమైన వాదనలకు విలువ ఉండ‌దు.. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఎప్పుడూ అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా ఉంటుంది. అక్క‌డి ప్రజలు మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ప్రయోజనం పొందుతూనే ఉంటారు” అని ఆయన అన్నారు.

ఇదిలా ఉండ‌గా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఎలాంటి అభివృద్ధి పనులు చేప‌ట్టిన ప్ర‌తీసారి చైనా విషం క‌క్కుతోంది. ఈ నెల ప్రారంభంలో బీజింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi).. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా నిర‌సన‌ వ్య‌క్తం చేసింది. మార్చి 9న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప్రపంచంలోనే అతి పొడవైన 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన డ్యూయ‌ల్‌-లేన్ టన్నెల్ అయిన‌ సెలా టన్నెల్‌ (Sela Tunnel)ను జాతికి ఇది ఉత్తరాన చైనా సరిహద్దును పంచుకునే తవాంగ్‌ (Tawang ) కు అన్ని వాతావరణ కనెక్టివిటీని క‌లిగి ఉంటుంది. 825 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సొరంగం, LAC వెంబడి ఉన్న ప్రాంతాలకు దళాలు, ఆయుధాల ర‌వాణాకు ఈ ట‌న్నెల్ అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే భారతదేశంలో అంత‌ర్భాగ‌మని చెబుతున్న‌ అరుణాచల్ ప్రదేశ్ ను తాము ఎప్పుడూ గుర్తించలేదని, దానిని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా చెప్పింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version