
Union Cabinet Decisions : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు (Union Cabinet Decisions ) తీసుకుంది. వ్యవసాయ సంబంధిత రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు (మార్చి 19) ఆమోదం తెలిపింది. మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vishnaw) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి, దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద క్యాబినెట్ రూ.3,400 కోట్లను ఆమోదించిందని చెప్పారు. మరోవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మార్కెట్ లింకేజీలను పెంచేందుకు, దేశవ్యాప్తంగా పాడి రైతులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా పాల అభివృద్ధి కార్యక్రమం కోసం రూ.2,790 కోట్లను కూడా క్యాబినెట్ ఆమోదించింది.
Union Cabinet Decisions : ఎరువుల రంగానికి బూస్టింగ్
అస్సాంలోని నమ్రూప్లో రూ. 10,601 కోట్ల పెట్టుబడితో కొత్త బ్రౌన్ఫీల్డ్ అమ్మోనియా-యూరియా కాంప్లెక్స్కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (BVFCL) నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్, ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది.దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఈశాన్య ప్రాంతంలోని రైతులకు సకాలంలో ఎరువుల లభ్యతను పెంచుతుంది.ఈ ప్రాజెక్ట్ 48 నెలల్లో పూర్తి కావడానికి ప్రణాళిక చేయబడింది.
#WATCH | Delhi: Union Cabinet today approved Incentive scheme for promotion of low-value BHIM-UPI transactions (P2M)
The scheme will be implemented at an estimated outlay of 1,500 crore for the FY 2024-25. Incentive at the rate of 0.15% per transaction value will be provided for… pic.twitter.com/fTSCVIReeB
— ANI (@ANI) March 19, 2025
డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం
Digital Payment Sectors : డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ‘తక్కువ విలువ కలిగిన BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకం (P2M)’ను మంత్రివర్గం పొడిగించింది. రూ. 1,500 కోట్ల అంచనా వ్యయంతో, ఈ పథకం డిజిటల్ చెల్లింపు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ఆర్థిక చేరికను ప్రోత్సహించడం లక్ష్యంగా చిన్న వ్యాపారులకు రూ. 2,000 వరకు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.4,500 కోట్లు
Greenfield National Highway : మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహకంగా, JNPA పోర్ట్ (పగోట్) ను మహారాష్ట్రలోని చౌక్ తో అనుసంధానించడానికి ₹4,500 కోట్ల పెట్టుబడితో 6 లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హై-స్పీడ్ నేషనల్ హైవే నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని పొడవు 29.2 కి.మీ. హైవే ప్రాజెక్ట్ బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (BOT) ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నారు. ఇది PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టనున్నారు.
ఈ హైవే JNPA పోర్ట్, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై-పుణే ఎక్స్ప్రెస్వే, NH-66 (ముంబై-గోవా హైవే) మధ్య సజావుగా కనెక్టివిటీని అందిస్తుంది. సహ్యాద్రి శ్రేణి గుండా రెండు సొరంగాలు వాణిజ్య వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన రాకపోకలకు వీలు కల్పిస్తాయి. కొండ ప్రాంతాలు, పన్వేల్, కలంబోలి, పలాస్పే ఫాటా వంటి పట్టణ రద్దీ ప్రదేశాలల్లోకి వెళ్లకుండా దాటవేస్తాయి. ఈ ప్రాజెక్ట్ సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని. ముంబై-పుణే బెల్ట్ అంతటా ప్రాంతీయ అభివృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.