Saturday, March 15Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌

Trending News
CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ "డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ (BR Ambedkar)ను అగౌరవపరుస్తోందని, దళితులు, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని" ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి మాత్రమే పట్టించుకుంటున్నదని ఆరోపించారు. నాడు అంబేద్కర్‌ ఎన్నికల్లో ఓడిపోవ‌డానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని, ఆయన చేసిన సేవలను తగిన విధంగా గౌరవించ‌లేద‌ని సీఎం యోగీ ఆరోపించారు. బాబా సాహెబ్‌కు స్మారక చిహ్నాలు నిర్మించాలని కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, అందుకు భిన్నంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు కీలక స్థలాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ 'పంచతీర్థాన్ని' అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అప్ప‌టి కాంగ్రెస్ ...

iPhone Dropped In Hundi | ప్రమాదవశాత్తూ హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఆలయం

Trending News
Tamil Nadu | తమిళనాడులో ఇటీవల ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌టన చోటుచేసుకుంది. ఒక భక్తుడి ఐఫోన్ (iPhone) అనుకోకుండా ఆలయంలోని హుండీలో ప‌డిపోయింది. అయితే ఆలయ అధికారులు హుండీలో ఉన్న వస్తువులను దేవుడికి నైవేద్యంగా పరిగణిస్తారని పేర్కొంటూ ఫోన్ ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. వినాయగపురంలో నివాసముంటున్న దినేష్ గత నెలలో చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత, అతను హుండీలో కొంత నగదును వేశాడు. అయితే చొక్కా జేబులోంచి నోట్లను తీస్తుండగా ఐఫోన్ జారి డబ్బుతోపాటు హుండీలో పడిపోయింది. పొరపాటును గ్రహించిన దినేష్ తన ఫోన్ ను తిరిగి తీసుకోవాల‌ని ఆలయ అధికారులను ఆశ్రయించాడు. అయితే హుండీలో ఒక్కసారి వేసిన వస్తువు దేవుడికే చెందుతుందని అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, హుండీని ప్రతి రెండు నెలల వరకు తెరవ...

ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగ‌ని ఆల‌యాల ధ్వంసం.. హిందువులే టార్గెట్‌

Trending News
Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ఆగ‌డం లేదు. హిందూ ఆల‌యాల ధ్వంసం ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మ‌రింత జోరందుకున్నాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప్ర‌మేయం ఉన్న 27 ఏళ్ల యువ‌కుడిని అరెస్టు చేశామ‌ని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్ల‌డించారు. హిందువులే ల‌క్ష్యంగా… గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల‌ను లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు అక్క‌డ చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 29న చట్గ్రామ్‌లో మూడు ఆలయాలను దండ‌గులు ధ్వంసం చేశారు. ఈ దాడుల‌ను కోట్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. దుండగులు హింస‌ను ప్రేరేపించ‌డానికే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయన ...

Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు

Trending News
sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన త‌ర్వాత‌ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మ‌రొక‌ పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న‌ మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆల‌యంలో ఆంజ‌నేయ‌స్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంట‌నే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన‌ తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్క‌డ‌ ఎలాంటి అల్ల‌ర్లు చోటుచేసుకోకుండా ప‌టిష్ట‌ భద్రత ...

జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు

Trending News
Indian Railways introducing New Amrit Bharat Express | భారతీయ రైల్వే 12,000 కంటే ఎక్కువ రైళ్లతో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రైల్వేస్టేష‌న్ల‌ (railway stations)ను ఆధునికీక‌రించ‌డ‌మే కాకుండా ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది. మ‌రోవైపు కొత్త రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. గత 10 సంవత్సరాలలో వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్ వంటి అనేక రైళ్లు పట్టాలెక్కాయి. అయితే ఇండియ‌న్‌ రైల్వే ఇప్పుడు పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల కోసం ఎక్కువ దూరం కూర్చొని సౌక‌ర్య‌వంతమైన ప్ర‌యాణం అందించే రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది. ఎక్స్ ప్రెస్ రైళ్లలో 10 స్లీపర్ , 10 జనరల్ కోచ్‌లు 10 నెలల పాటు అమృత్ భారత్ రైళ్లను ప్యాసింజర్ ఆపరేషన్లలో విజయవంతంగా పరీక్షించిన తర్వాత, మరో 50 రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణయించినట్లు...

Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Trending News
Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ 'పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్ల‌మెంట్‌ (Parliament)కు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది 'ముస్లింల బుజ్జగింపు చ‌ర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోష‌ల్‌మీడియాలో అనేక మంది నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు 'విజయ్ దివస్' నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ మ...

Aadhaar free online update | మీ ఆధార్ ఇంకా అప్ డేట్ చేయలేదా.. మీకో గుడ్ న్యూస్..

Trending News
Aadhaar card free online update | ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాల‌నుకునే వారికి గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మిలియన్ల కొద్దీ ఆధార్ దారుల‌కు ఊర‌ట క‌లిగిస్తూ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ ఉచిత సేవ కోసం గడువు మొదటగా జూన్ 14, 2024 వ‌ర‌కు విధించ‌గా, ఆ త‌రువాత సెప్టెంబరు 14, 2024 వరకు పొడిగంచింది. ఇక తాజాగా మ‌రోసారి ఎక్స్‌టెండ్ చేస్తూ అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి డిసెంబర్ 14, 2024 వరకు తుది గ‌డువు విధించింది. “#UIDAl ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది; లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర‌నుంది. ఈ ఉచిత సేవ #myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. #ఆధార్‌లో తాజా ధ్రవీక‌ర‌ణ పత్రాలను అప్‌డేట్ చేయాల‌ని UIDL ” అని ఒక ట్వీట్‌లో పేర్కొంది. అసలు గడ...

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

Trending News
IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మ‌రో యాప్ ను వినియోగిస్తున్న‌రు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. IRCTC New App :ప్ర‌యాణికుల‌కు రైల్వేసేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. రైల్వేశాఖ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్ర‌యాణికులు IRCTC యాప్ వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారు. అయితే రైలు ర‌న్నింగ్ స్టాట‌స్ ను తెలుసుకోవ‌డానికి, PNRని తనిఖీ చేయడానికి ప్రత్యేక యాప్‌ని ఉపయోగిస్తున్నా...

IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..

Trending News
IRCTC MAHA KUMBH PUNYA KSHETRA YATRA | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి "మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర" భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అనే మరో టూరిస్ట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాసిలోని అన్నపూర్ణా దేవి, శ్రీరామ జన్మ భూమి, అయోధ్యలోని హనుమాన్ గర్హిని కవర్ చేస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు, రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి, క్యాటరింగ్‌లు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆసక్తిగల ప్రయాణికులు వెబ్‌సైట్: http://www.irctctourism.com ని సందర్శించవచ్చు లేదా 040-27702407/ 9701360701/ 9281495845ను సంప్రదించడం ద్వారా కౌంటర్ బుకింగ్‌లను సంప్రదించవచ్చు. పర్యటన వివరాలు    వ్యవధి : 07 రాత్రులు/08 రోజులు    పర్యటన తేదీ : 19.01.2025    పర్యటన ...

Vande Bharat | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ 136 సర్వీసులు.. ఏ రాష్ట్రంలో అత్యధిక రైళ్లు ఉన్నాయి?

Trending News
Full list of Vande Bharat Express trains | డిసెంబర్ 2024 నాటికి భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిలో ఎక్కువగా 16 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడులో సేవలందిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి బనారస్‌ మధ్య వందేభారత్ రైలు దేశంలో ఎక్కువ దూరం (771 కి.మీ.) ప్రయాణిస్తుంది. ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్లు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ఆధునిక సౌకర్యాలతో దేశంలో తక్కువస సమయంలోనే బాగా జనాదరణ పొందాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ డిమాండ్, వనరుల లభ్యత వంటి అంశాలపై ఆధారపడి, కొత్త వందేభారత్ సేవలను, వాటి వేరియంట్‌ల ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా (Full list of Vande Bharat Express trains ) 20830 - విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 20833 - విశాఖపట్నం సికిం...
Exit mobile version