Saturday, March 15Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్

Trending News
Ayodhya: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Temple) నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. శనివారం మూడు గంటలపాటు ట్రస్ట్ అధికారుల సమావేశం జరిగింది. అనంతరం, విదేశీ కరెన్సీలో విరాళాలు తీసుకునే చట్టపరమైన ప్రక్రియతో సహా 18 అంశాలపై చర్చించామని, ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం కింద అనుమతి కోసం ట్రస్ట్ దరఖాస్తు చేసిందని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. "ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023 వరకు ఆలయ నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,000 కోట్లకు పైగా ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లోనే మిగిలి ఉంది" అని చంపత్ రాయ్ చెప్పారు. జనవరి 2025 నాటికి ఆలయం మూడు దశల్లో పూర్తవుతుందని తెలపిారు. . సరయూ నది ఒడ్డున ...

dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

Trending News
Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చాడని భావించారు. అయితే కవర్ లో దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, " నా దుకాణం చుట్టూ మురుగు నీరు నిలిచి ఉంది. అక్కడ విపరీతంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం వద్ద మాకు తీవ్రమైన దోమలు, విషకీటకాల సమస్య ఉంది అని వివరించాడు. "నన్ను నేను రక్షించుకోవడానికి దోమల సమస్యను పరిష్కరించడానికి, నేను కొన్ని దోమలను పాలిథిన్...

టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

Trending News
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్ లో చదివిన ఈ ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్ ను మాట్లాడుతామని బయటకు పిలిచారు. తమ వెంట తెచ్చిన గన్ తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది మరోవైపు టీచర్‌ కాలుపై కాల్పులు (Students Shoot Teacher జరిపి ప...

Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ

Trending News
Uber driver harassing incident : రాజస్థాన్‌లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్‌ నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మనాలి గుప్తా తన కూతురిని స్కూల్ నుండి తీసుకువెళ్లడానికి వెళుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి వివరిస్తూ.. వీడియోను షేర్ చేసింది. వీడియోలో, మనాలి తనతో ఏమి జరిగిందీ.. ఉబర్ డ్రైవర్ తనను ఎలా వేధించాడో వివరించింది తన కూతురిని స్కూల్ నుంచి పికప్ చేసుకునేందుకు రైడ్ బుక్ చేశానని, తాను ఎవరితోనో కాల్ చేస్తున్నప్పుడు కారు డ్రైవర్ అకస్మాత్తుగా తన ఫోన్ లాక్కోవడానికి యత్నించాడని వివరించింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయి అతడిని వారించేందుకు ప్రయత్నించింది.. కానీ డ్రైవర్ దూషించడం మొదలుపెట్టాడు. Uber driver harassing incident  మనాలి కారును ఆపమని డ్రైవర్‌ని చాలాసార్లు చెప్పినా కూడ...

ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో నేలమట్టం..

Trending News
  ujjain horror : ఇటీవల యావత్ దేశాన్ని కలచివేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచార ఘటనలో నిందితుడి ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేయించింది. 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు భరత్ సోనీకి చెందిన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ నేలమట్టం చేసింది. నివేదికల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు బుధవారం కూల్చివేశారు. తర్వాత అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయడానికి బుల్‌డోజర్‌ను అక్కడికి తీసుకువచ్చారు. వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్న భరత్‌ సోనీని గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. 12 ఏళ్ల బాలికపై భరత్ సోనీ అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక చిరిగిపోయిన దుస్తులతో వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి సాయం అడిగింది. అయితే ఆ బాధితురాలికి ఎవరూ సహాయం చేయలేదని మీడియాలో వార్తలు వచ్చాయి....

215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..

Trending News
తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో జరిగిన నాటి ప్రభుత్వ అధికారుల దురాగతానికి సంభందించిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది  అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులందరూ  దోషులుగా మద్రాస్ హైకోర్టు నిర్ధారించింది. ఈమేరకు శుక్రవారం అన్ని అప్పీళ్లను కొట్టివేసి గతంలో సెషన్స్ కోర్టు  ఇచ్చిన తీర్పును సమర్థించింది. "బాధితులు, ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా, స్థిరంగా ఉన్నాయని ఈ కోర్టు కనుగొంది, అవి నమ్మదగినవి" అని ప్రాసిక్యూషన్ తన సాక్ష్యం ద్వారా తన కేసును రుజువు చేసిందని జస్టిస్ పి వెల్మురుగన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. జూన్ 20, 1992న, అధికారులు స్మగ్లింగ్ గంధపు చెక్కల కోసం   వాచాతి గ్రామం పై దాడి చేశారు. ఈ దాడిలో, ఆస్తి, పశువుల విధ్వంసం చేయడమే కాకుం...

ఓ వ్యక్తికి రెండేళ్లుగా కడుపునొప్పి, ఎక్స్ రే చూసి బిత్తరపోయిన డాక్టర్లు.. కడుపులో నుంచి ఏకంగా వంద వస్తువులు

Trending News
పంజాబ్ లో ఓ ఊహించని ఘటన జరిగింది. పంజాబ్‌లోని మోగాలోని ఓ ఆసుపత్రి వైద్యులు గురువారం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా కడుపులో నుంచి వచ్చిన వస్తువులను చూసి షాక్ కు గురయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలను బయటకు తీశారు. . 40 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా వికారం, వాంతులు, తీవ్ర జ్వరం కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతూ.. మోగాలోని మెడిసిటీ ఆసుపత్రిలో చేరాడు. అతని కడుపు నొప్పి తగ్గకపోవడంతో, అతని నొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యులు అతని కడుపుపై ​​ఎక్స్-రే స్కాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన వైద్యులు బిత్తరపోయారు. స్కాన్‌లో మనిషి కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్ర చికిత్స అనంతరం అతడి శరీరంలోని నుంచి సుమారు 100కు పైగా వస్తువులను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. అతని కడుపులోంచి బయటకు తీసిన దాదాపు వ...

జనవరి 2024 వరకు రామ మందిరం పక్కనే అయోధ్య విమానాశ్రయం సిద్ధం

Trending News
అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం జనవరి 2024 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడుతుంది మరియు అదే సమయంలో రామ మందిరంతో పాటు నిర్మాణం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Temple) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆలయం పక్కనే పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం (Maryada Purushottam Shri Ram Airport )పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాగా మొదటి కమర్షియల్ విమాన కార్యకలాపాలు జనవరి 2024లో ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. "ఇదే సమయంతో పోటాపోటీగా రామ మందిర నిర్మాణంతో పాటు విమానాశ్రయం కూడా పూర్తవుతుంది" అని ఒక అధికారి చెప్పారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారుల ప్రకారం.. మొదటి దశలో అయోధ్య విమానాశ్రయం నుంచ...

Liquor Prices in India : దేశంలోనే లిక్కర్ ధరలు ఎక్కడ ఖరీదు.. ఎక్కవ చవక..? అసలు కారణమేంటీ..

Trending News
Liquor Prices in India : ప్రభుత్వాలకు అతి ప్రధానమైన ఆదాయ వనరు మద్యమే.. మద్యం ప్రియుల పుణ్యమాని ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దేశంలో అత్యధిక మంది మద్యం తాగే రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ మద్యం ధరలు ఎంత పెంచినా కూడా తాగడం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా డిసెంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలుల్లోకి రానుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశం లేదు. అయితే.. ఎన్నికల తర్వాత పెరగొచ్చని తెలుస్తోంది. ఆంధ్రాలోనూ మద్యం ధరలు భారీగానే ఉన్నాయి. తెలంగాణ ధరలకన్నా ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల వారు తెలంగాణ నుంచే మద్యం తీసుకెళుతున్నారు. దేశంలో మద్యం ధరలు ఎక్కడ తక్కువ ఉంటాయో మీకు తెలుసా... అత్యధిక ధరలు ఎక్కడ ఎందుకీ వ్యత్యాసం అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మనదేశంలో Goa పర్యాటకానికి స్వర్గదామం... ఆహ్లాకరమైన సముద్ర తీరం, బీచ్‌లకు మొదటగా గుర్తుకొచ్చేది గోవా...

వైరల్ వీడియో: జైలర్ పాటకు ఈ చిన్నారి అదిరిపోయే పర్ఫార్మెన్.. అందరూ వావ్ అనాల్సిందే..

Trending News
Jailer Viral Video:  వినోద ప్రపంచంలో సంగీతం, నృత్యానికి.. సరిహద్దులు లేవు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం "జైలర్" విషయంలో అలాంటిదే ఉంది. ఈ సినిమా పాటకు సంబంధించిన వైరల్ డ్యాన్స్ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. జైలర్ సినిమాలోని ‘నువు కావాలయ్యా ’ పాటలో తమన్నా భాటియా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ను చూసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది అనుకరిస్తున్నారు. ఈ క్రేజీ డ్యాన్స్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. ఒక చిన్నారి " నువు కావాలయ్యా.. " అనే పాటకు వేసిన స్టెప్పులు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. తన వయసుకు మించిన ప్రతిభను కనబరిచి ఆ చిన్నారి పాటలోని సాహిత్యాన్ని నేర్పుగా అనుకరిస్తూ మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేసింది. ఈ  వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చేయగా ఎంతో మంతి హృదయాలను దోచుకుంటోంది. 136k పైగా లైక్‌లను పొందింది. చిన్నారి వీడియోపై నెటిజన్లు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. "ప...
Exit mobile version