Saturday, March 15Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

Viral News : రీల్స్‌ చేసే వరడు కావలెను.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పెళ్లి ప్రకటన..

Trending News
Viral News : కాలం వేగంగా మారుతోంది. ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హవా నడుస్తోంది. క్రియేటివిటీ హద్దు అదుపు లేకుండా పోతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతుల్లోకి వచ్చేసినట్టే. సోషల్‌మీడియా పుణ్యమా అని... ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో వ్యవధిలోనే మన కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే కొన్నాళ్లుగా రీల్స్‌ చేయడం యూత్ అదేపనిగా పెట్టుంటున్నారు..  వైరటీ రీల్స్‌ చేయడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. ఇప్పుడు ఇదే ట్రెండ్.‌. ఆ రీల్స్‌ వల్ల ఫాలోవర్లు పెరిగి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. సోషల్‌ మీడియాలో కొత్త రీల్స్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమే కాదు.. ఉన్నఫాలోవర్లను నిలుపుకోవడం కాస్త కష్టమే. దీని కారణంగా రీల్సే జీవితంగా బతికేస్తున్నారు చాలా మంది. తాజాగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన ఓ యువతి.... ...

ఆస్పత్రి మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూస్తున్న పెంపుడు కుక్క..! మనసును కదిలించే ఘటన..

Trending News
పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య ఉండే అనుబంధాన్ని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న వీడియోలను చూసినప్పుడు మన హృదయాలు ద్రవిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులకే విశాల హృదయం, దయ, ప్రేమ ఉంటుందనిపించే సన్నివేశాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక పోస్టు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక పెంపుడు కుక్క (Pet Dog ) తన యజమాని కోసం చూస్తున్న ఎదురుచూపులు అందరినీ కదలించేలా చేసింది. ఆ వివరాలు ఇవీ.. ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ నగరంలోని MCU హాస్పిటల్ మార్చురీ ఎదుట ఒక కుక్క రోజుల తరబడి పడిగాపులు కాస్తుంది. ఆహారం, నిద్ర లేకుండా ఆ కుక్క ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇదే ఆస్పత్రికి చేరుకుని మార్చురీ ముందే నిరీక్షిస్తుూ ఉంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది, అక్కడే చదువుతు...

Elections 2023: 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి … ప్రతీసారి డిపాజిట్ దక్కలేదు.. మళ్లీ ఈసారి…

Trending News
madhya pradesh Elections 2023: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చెందిన ప్రమానంద్ తోలానీ గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి ఆయన్ను ఏనాడూ వరించలేదు.. ఏకంగా 18 సార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన 63ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారికి.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. కానీ ఎన్నిఓటములు వచ్చినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు. తాజాగా రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమానంద్ తోలానీ నామినేషన్ దాఖలు చేశారు.. వరుస ఓటములు అతనికి "ఇండోరి ధరి పకడ్" బిరుదును సంపాదించిపెట్టింది. ‘ప్రజలు చాలా తెలివైన వారు..’ నవంబర్ 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (madhya pradesh Elections 2023:) ఇండోర్-4 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రమానంద్ తోలని తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, అతను ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. "ఇ...

1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్‌లోని శారదా మందిర్‌లో తొలిసారిగా నవరాత్రి పూజలు

Trending News
Kashmir : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని శారదా మందిర్‌(Sharda Mandir )లో 1947 తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని తీత్వాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ పూజలో పలువురు కాశ్మీరీ పండిట్‌లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఈ ఆలయం 1947 దాడుల్లో ధ్వంసమైంది. దేశ విభజనకు ముందు రోజులలో ఉన్న అదే నిర్మాణ శైలిలో, అదే స్థలంలో పునర్నిర్మించబడింది. ఈ ఏడాది మార్చి 23న నవేరి- కాశ్మీరీ కొత్త సంవత్సరం సందర్భంగా, అలాగే జూన్‌లో శారదా దేవి విగ్రహానికి అభిషేకం, ప్రాణ-ప్రతిష్ట జరిగినప్పడు ఆలయాన్ని తెరిచారు. ఇక దసరాను పురస్కరించుకొని శారదా మందిర్‌లో అక్టోబర్ 15 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. ఈ ఆలయంలో పూజలు నిర్వహించడ...

రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?

Trending News
గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..? ఇజ్రాయెల్‌- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం.. పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీరప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది. కాగా 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం ఈ రేఖ ఏర్పడింది. పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా (Gaza) స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ విస్తీర్ణం 5,970...

Bastar dussehra : ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన 75 రోజుల దసరా వేడుకలు ఎక్కడో తెలుసా..

Trending News
Bastar dussehra : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ప్రత్యేకమైన దసరా వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి, 600 ఏళ్ల నుంచి వస్తున్న పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడి గిరిజన ప్రజలు 'కచ్చిన్' దేవతకు ఆరాధిస్తారు. బస్తర్‌లోని 'రాజ్ పరివార్' కమిటీ ఈ ఉత్సవాలను ప్రారంభించింది. ప్రధాన కార్యక్రమం జగదల్పూర్‌లో జరుగుతుంది. ఇక్కడ పట్టణం మొత్తం విస్తృతమైన అలంకరణలతో ముస్తాబైంది. 75 రోజుల వేడుకలు Bastar dussehra వేడుకల విశిష్టత ఏమింటే.. బస్తర్‌లోని దసరా పండుగ సాధారణంగా 75 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన దసరా వేడుకగా నిలిచింది. బస్తర్‌లోని ఈ 75 రోజుల వేడుక విలక్షణమైన ఆచారాలను ప్రతిరోజూ పాటిస్తారు. దసరా (విజయదశమి) సందర్భంగా దేశమంతటా 'రావణుని' దిష్టిబొమ్మలను దహనం చేస్తే.. ఇక్కడ అలాంటి ఆచారం ఉండదు. ఈ పట్టణంలో 'మహిషాసుర మర్దిని ఆదిశక్తికి'గా కొలుస్తారు. దసరా వేడుకల్లో జిల్లాలోని గి...

భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

Trending News
దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్‌ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం. పూర్తిగా మహిళా పైలట్లే.. దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో...

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

Trending News
చండీగఢ్‌: పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌ వాహనంతోనే పరారయ్యాడు (man flees with police car) దీంతో పోలీసులు తమ వాహనం కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఒక చోట పోలీస్‌ వాహనం కనిపించింది. కానీ లాక్‌ చేసి ఉండటంతో కీ కోసం ఆ ప్రాంతంలో మళ్ళీ వెతికారు. హర్యానాలోని యమునా నగర్‌ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. ఖుర్ది గ్రామంలో ఒక కుటుంబ కలహాలకు సంభందించిన వివాదంపై పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ ( ERV )లో పోలీసులు(Haryana Police) ఆ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు ఘర్షణ పడటం వీరి కంట పడింది.. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోనికి ఎక్కించారు. కాగా, పోలీసులు అనంతరం ఆ గ్రామానికి వెళ్లారు.. ఫోన్‌ చేసిన ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీయడంలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇంతలో పోలీసు వాహనంలో ఉన్న...

ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

Trending News
ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్ ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో కొంతమంది అసభ్యకరమైన రీతిలో దుస్తులతో కనిపించడంతో 'నీతి' సబ్‌కమిటీ ('Niti' sub-committee ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని, దురదృష్టవశాత్తూ కొందరు ఇతరుల మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ అన్నారు. "కొంతమంది చిరిగి...

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Trending News, World
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...
Exit mobile version