Monday, April 28Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

ATM on Wheels | నడుస్తున్న రైలులో డబ్బు డ్రా చేసుకోవచ్చు.. వీడియో చూడండి

ATM on Wheels | నడుస్తున్న రైలులో డబ్బు డ్రా చేసుకోవచ్చు.. వీడియో చూడండి

Trending News
ATM on Wheels : సువిశాలమైన భారత దేశాన్ని అనుసంధానించడానికి భారతీయ రైల్వేల కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు. చాలా రైళ్లు దేశంలోని ఒక చివర నుంచి మరో చివరకు ప్రయాణించడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రయాణంలో మీ జేబు ఖాళీ కాకుండా చూసుకోవడానికి, రైల్వేలు రైళ్లలో ATMల కోసం ఏర్పాట్లు చేయబోతున్నాయి. దీని కోసం సెంట్రల్ రైల్వే కూడా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. కాబట్టి ఇప్పుడు మీకు రైలు ప్రయాణంలో ఉండగా నగదు అవసరమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు దారిలో ఏ స్టేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు, లేదా మీరు ఏ స్టేషన్‌లో దిగాల్సిన అవసరం కూడా లేదు. రైల్వేస్ ఇప్పుడు కదులుతున్న రైళ్లలో ATMలను ఏర్పాటు చేయబోతోంది. ఈ ATM ఆన్ ది వీల్ అనే భావన చాలా ప్రత్యేకమైనది. మన్మాడ్ ఎక్స్‌ప్రెస్‌లో ATM on Wheels మన్మాడ్-ఎంఎస్‌ఎంటీ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్...
Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Trending News
Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఓవర్ హెడ్ వైర్లు (OHE) 25 వేల వోల్ట్స్ (25 kV) విద్యుత్తుతో విజయవంతంగా పనిచేసేలా చేయబడ్డాయి. దీని ద్వారా రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సిద్ధమైంది. ఈ మార్గంలో 4 కిలోమీటర్ల OHE సిస్టమ్‌ను విద్యుదీకరించారు.త్వరలో ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభం అవుతాయి. విద్యుత్ సరఫరా కోసం సారాయ్ కాలే ఖాన్‌లో ఒక ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్ ఉంది. ఇది 66kV విద్యుత్తును అందుకొని, రైళ్లకు 25kV, స్టేషన్ల అవసరాలకు 33kVగా పంపిస్తుంది. సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ప్రత్యేకతలు: ఈ స్టేషన్ 4 రైలు మార్గాలు, 6 ప్లాట్‌ఫారమ్‌లు కలిగి ఉంది. 5 ప్రవేశ/నిష్క్రమణ గేట్లు, 14 ఎలివేటర్లు, 18 ఎస్కలేటర్లు ఉన్నాయి. స్టేషన్ పొడవు 215 మీటర్లు, వెడల్పు 50 మీటర...

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Trending News
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు. ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింద...

Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..

National, Trending News
Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది. Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest train) గా దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ (Vivek Express) గుర్తింపు పొందింది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్‌ను తమిళనాడులోని కన్యాకుమారికి కలుపుతుంది. మొత్తం 4,189 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 75 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తొమ్మిది రాష్ట్రాల గుండా వెళుతుంది. 57 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. Super Vasuki : సూపర్ వాసుకి రైలు గురించి...

Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు

Trending News
Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడుస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు 1,200 జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేసినట్లు మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రస్తుతం ప్రయాణీకుల కోసం రైళ్లలో ప్రయాణించేందుకు 79,000 కోచ్‌లను ఉపయోగిస్తున్నాయని, వీటిలో 56,000 కోచ్‌లు, మొత్తం 70 శాతం జనరల్, నాన్-ఎసి స్లీపర్ కేటగిరీ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు. Indian Railways : కొత్తగా ఎల్ హెచ్ బి కోచ్ లు అన్ రిజర్వ్ డ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను పెంచడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రె...

Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం

Trending News
స్టాంప్ డ్యూటీ, రాయల్టీ చెల్లింపులు ఇవే.. Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపింది. గత 5 సంవత్సరాలలో, ప్రభుత్వం వివిధ రకాల పన్నులు, విద్యుత్ బిల్లుల ద్వారా ఏకంగా రూ. 400 కోట్లు చెల్లించింది .అయోధ్యలో 2020 ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గత సంవత్సరం జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా అయోధ్యలోని రామాలయ నిర్మాణం దాదాపు 96 శాతం పూర్తయింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, ఆలయ పనులు జూన్ 2025 నాటికి పూర్తవుతాయి. సప్త రుషి ఆలయాలలో చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులు మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi) 2020 ఫిబ్రవరి 5న ఏర్పడినప్పటి నుంచి గత 5 సంవత్సరాలలో ...

Yogi Adityanath | నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ పై అకస్మాత్తుగా చర్చ ఎందుకు వచ్చింది..? ఖాట్మండులో వీధుల్లోకి జనం

Trending News
Uttar Pradesh | : పొరుగు దేశమైన నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వేలాది మంది వచ్చి యూపీ సీఎం ప్లెక్సీ ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. హిందూత్వ అనుకూల మాజీ రాజు జ్ఞానేంద్ర షా (Raja Gyanendra Shah) తిరిగి రావడంతో, హిందూ దేశం కోసం డిమాండ్ తీవ్రమైంది. నేపాల్‌లో దాని మద్దతుదారులు రాజుతో పాటు యోగి ఫొటోలతో కూడిన జెండాలను ఎగురవేస్తూనినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్ (Nepal) లో కొన్నేళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హిందూ సనాతన ధర్మానికి అనుకూలంగా నిలబడ్డారు. చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం 2006లో రాజు జ్ఞానేంద్ర పాలనను ముగించిందని నమ్ముతారు. దీని తర్వాత నేపాల్‌లో వామపక్షాలు పాలించాయి. పుష్ప కమల్ దహల్ ప్రచండ తర్వాత, కె.పి. శర్మ ఓలి ఆ...

Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి

Trending News
Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును స్వయంగా మార్చుకున్నారు. గతంలో 6 తుగ్లక్ లేన్ అని రాసిన తన ఇంటి బోర్డును ఆయన 6 వివేకానంద మార్గ్ (Vivekananda Marg) గా మార్చారు. దినేష్ శర్మకు 6, తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ నివాసం కేటాయించారు. ఇక్కడ, అతను తన కుటుంబంతో కలిసి తన నివాసంలో గృహ ప్రవేశ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుగ్లక్ లైన్ నుంచి స్వామి వివేకానంద మార్గ్ గా. ఎంపి అధికారిక నివాసం నేమ్ ప్లేట్ పై 'స్వామి వివేకానంద మార్గ్' అని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ గురువారం (మార్చి 6) పూజాకార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్లారు...

Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ

Trending News
Sambhal Case : సంభాల్‌లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10 గంటలకు విచారించనుంది. కొన్ని నెల‌లుగా తీవ్ర చర్చకు దారితీసిన సంభాల్ మ‌సీదు (Jama Masjid) ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి అనుమతి కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు జరిగే విచారణ సందర్భంగా, భారత పురావస్తు సర్వే (ASI) బృందం మసీదు పరిశుభ్రతపై నివేదికను సమర్పిస్తుంది. మసీదును పరిశీలించి దాని పరిశుభ్రతను నిర్ధారించాలని కోర్టు గతంలో ASIని ఆదేశించింది. ASI నివేదికకు ప్రతిస్పందనగా మసీదు కమిటీ ప్రతినిధులు సమాధాన‌విమ‌వ్వ‌నున్నారు. మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, శుక్రవారం కోర్టు (Allahabad High Court) షాహి జామా మసీదు ప్రాంగణాన్...

Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని

Trending News
Maha Kumbh ends today : మహాకుంభ్ 2025 ప్రత్యక్ష ప్రసారం: ప్రపంచంలోనే అతిపెద్ద భ‌క్త‌ సమ్మేళనమైన మహాకుంభమేళా నేడు మహాశివరాత్రి పుణ్య‌స్నానంతో ముగియనుంది. మహాకుంభ‌మేళా ఐదు పవిత్ర స్నానాలకు వేదికైంది, వాటిలో మూడు అమృత స్నానాలు. జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి అమృత స్నానాలు, జనవరి 13న పౌస్ పూర్ణిమ, ఫిబ్రవరి 12న మాఘ‌ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఇతర ముఖ్యమైన స్నాన రోజులు. మ‌హాకుభ‌మేళా ఉత్స‌వాన్ని విజయవంతం పూర్తి చేయ‌డంలో యూపి ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా 45 రోజుల ఉత్స‌వాల‌ను ముగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు త‌మ క్షేమం కోరుతూగంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు ఆచ‌రించారు. ఈ గొప్ప కార్యక్రమం నేడు ముగిసింది. Maha K...
Exit mobile version