Monday, March 3Thank you for visiting

Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌

Spread the love

Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమై తిరుప‌తిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా త‌నిఖీ చేయ‌డంతో ఇక్కడ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేప‌ట్టాల‌ని ప్రతిపాదించారు. సెంట్ర‌ల్‌ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు.

సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం

13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో బ‌స్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణీకుల టెర్మినల్, బస్ టెర్మినల్, కారు, ద్విచక్ర వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, రోప్‌వే వంటివి ఉన్నాయి. ఎంపీ కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన రెండు వారాల తర్వాత ఈ ప్రాజెక్ట్ పై పురోగ‌తి వ‌చ్చింది. వచ్చే నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత పనులు ప్రారంభిస్తామని గడ్కరీ ధృవీకరించారని ఎంపీ గురుమూర్తి ఈ సంద‌ర్భంగా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన, కొత్త కాంప్లెక్స్‌లో ఎన్ని అంతస్తులను అనుమతించవచ్చనే విషయమై మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గత రెండేళ్లుగా ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రారంభంలో 15-అంతస్తుల భవనంగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత‌ డిజైన్ 11 అంతస్తులకు కుదించారు. “అన్ని ఆమోదాలు YSRC ప్రభుత్వ హయాంలోనే పొందాయి. అయితే ఎన్నిక‌ల కోడ్‌, నిర్మాణంలో మార్పుల కారణంగా ప్రక్రియ ఆగిపోయింది” అని గురుమూర్తి తెలిపారు.

భారీగా పెరగుతున్న ప్రయాణికులు

కొత్త‌గా నిర్మించ‌నున్న తిరుప‌తి బ‌స్ టెర్మిన‌ల్ (Tirupati Intermodal Bus Station) లో అత్యాధునిక సౌకర్యాల‌ను కల్పించ‌నున్నారు. ఇందులో రిటైల్ జోన్‌లు, ఫుడ్ కోర్ట్, హోటల్, ప్యాసింజర్ లాంజ్, భక్తుల కౌంటర్లు, మెడికల్ స్టోర్స్‌, బేబీ కేర్ రూమ్‌లు, ATMలు, EV-ఛార్జింగ్ స్టేషన్, లు ఉంటాయి. ప్రస్తుత బస్టాండ్‌లో రద్దీ ఎక్కువగా ఉందని, సగటున 1,80,000 మంది ప్రయాణికులకు సేవలందిస్తోంద‌ని ఎంపీ తెలిపారు. రోజూ 4,000 బస్సులు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. తిరుపతికి నానాటికీ పెరుగుతున్న యాత్రికుల రద్దీతో, ఉన్న మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, స్కై వాక్ సెంట్రల్ బస్టాండ్‌ను రైల్వే స్టేషన్‌కు కలుపుతుందని, ఇంటర్-మోడల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఈ సదుపాయాన్ని NHLML సహకారంతో NHAI నిర్వహిస్తుంది. స్టేషన్ ఉమ్మడి అభివృద్ధి కోసం NHLML, AP రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మధ్య ఆగస్టు 18, 2022న ఒప్ప‌దందం కుదుర్చుకుంది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version