
TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC) ప్రకటించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సులు కాచిగూడ స్టేషన్, జైలు గార్డెన్, సూపర్బజార్, దిల్సుఖ్నగర్, ద్వారకానగర్, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్, పనామా, భాగ్యలత, హయత్నగర్, ఎల్ఆర్ పాలెం, పెద్ద అంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్మెట్ మీదుగా నడుస్తాయి.
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్మెట్కు మొదటి బస్సు ఉదయం 6:10 గంటలకు, చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు, అబ్దుల్లాపూర్మెట్ నుంచి కాచిగూడకు మొదటి బస్సు ఉదయం 7:20 గంటలకు, చివరి బస్సు 9 :50 pmగంటలకు బయలుదేరుతుంది. మార్గంలో బస్సుల ఫ్రీక్వెన్సీ 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది.
హైదరాబాద్ నుండి శ్రీశైలానికి బస్సు సర్వీసులు
పవిత్ర శైవ క్షేత్రమైన శ్రీశైలానికి (Srisailam) రోజు రోజుకు భక్తులు పెరిగిపోతున్నారు. దీంతో ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి తగినన్ని బస్సు సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిర్ణయించింది.
ఈ బస్సులు హైదరాబాద్ లోని MGBS, JBS, BHEL, ఇతర ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయని, బస్సుల మధ్య సగటు ఫ్రీక్వెన్సీ అరగంట ఉంటుందని TGSRTC అధికారులు తెలిపారు. MGBS నుంచి శ్రీశైలం వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీలు రూ.510 ఉంటుంది. JBS నుంచి రూ.540. అదేవిధంగా, ఇతర ప్రాంతాల నుండి శ్రీశైలం వరకు వివిధ రకాల బస్సులకు సగటున రూ. 500 నుంచి రూ. 650 వరకు ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ కూడా రాజధాని ఏసీ బస్సులను ఈ మార్గంలో నడుపుతోంది. www.tgsrtconline.in లో టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..