Wednesday, April 16Welcome to Vandebhaarath

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..
Andhrapradesh, Telangana

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి. ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...
Telangana

Self Help Groups | మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..

Self Help Groups RTC Buses | రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండ‌ల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు మొత్తం 150 ఆర్టీసీ అద్దె బ‌స్సులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను సైతం మంగళవారం విడుదల చేసింది. ఒక్కో బ‌స్సు విలువ రూ.36 ల‌క్ష‌లు. ఒక్కో మండ‌ల స‌మ‌ఖ్య, ఒక్కో బ‌స్సును కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దె ఇవ్వ‌నుంది.నెలకు అద్దె రూపంలో మండ‌ల స‌మ‌ఖ్య(Self Help Groups) కు టిజి ఆర్టీసీ (TGSRTC) రూ. 77, 220 చెల్లించ‌నుంది. మొత్తం 150 అద్దె బ‌స్సుల‌ను ఆర్టీసికి మండ‌ల స‌మ‌ఖ్యలు అప్పగించనున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా డిపోల‌కు ఆయా బ‌స్సుల‌ను విన‌యోగించ‌నున్నారు. మొదటి విడతలో ఈ జిల్లాలకు కాగా మొద‌టి విడ‌త‌లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ జిల్లాల మ‌హిళా స‌మాఖ్య‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం అవ‌కాశం క‌ల్పించింది. ఈ నాలుగు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో ఆర్థికంగా ప...
Telangana

Maha Shivaratri Buses | మ‌హా శివ‌రాత్రి శ్రీశైలానికి 800, వేముల‌వాడ‌కు 700 ప్ర‌త్యేక బ‌స్సులు

Maha Shivaratri Buses | హైదరాబాద్: ఫిబ్రవరి 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 3,000 ప్రత్యేక బస్సులను నడపనుంది.ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 43 శైవ క్షేత్రాలకు సేవ‌లందించ‌నున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 800 కి పైగా ఎక్కువ‌ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. శ్రీశైలానికి (Srishailam) 800, వేములవాడకు 714, కీసరగుట్ట (keesaragutta) కు 270 , ఏడుపాయకు 444, వేలాలకు 171, కాళేశ్వరం(Kaleshwaram) 80, కొమురవెల్లికి 51 , ఇతర ప్రాంతాలకు మొత్తం 800 సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్(MGBS), జెబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కెపిహెచ్‌బి, బి...
Telangana

Ration Card Updates | రేష‌న్ కార్డుల ద‌ర‌ఖాస్తుల‌పై స‌ర్కారు కీలక అప్ డేట్‌

Ration Card Updates : రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవా కేంద్రాల వద్ద కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఆయా సెంటర్లు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశాల మేరకు తాము ఎలాంటి తుది గడువు విధించలేదని.. కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ, దరఖాస్తుదారులెవరూ ఇబ్బందులు పడొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. భారీగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన ప్రజాపాలన, కులగణన (Caste Census ) సర్వే సహా ...
Telangana

TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?

TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే డిమాండ్ తెర‌పై కి వ‌చ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌చ్చు. టికెట్ల విష‌యంలో తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని బీసీ సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్...
Telangana

BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!

Telangana BJP District Presidents list | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై బిజెపి ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది .గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిది సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాసిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. తాజాగా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల ఎంపిక పై రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది. Telangana BJP District Presidents list బిజెపి జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. హైదారాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్ మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్ మెదక్ – రాధా మల్లెష్ గౌడ్ వరంగల్- గంట రవి హన్మకొం...
Telangana

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే.. గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మా...
Telangana

Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగ‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొన‌సాగుతుండ‌గా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆద...
Telangana

EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

TGSRTC EV Bus | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించే దిశ‌గా టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్య‌ను తెలంగాణ ప్రభుత్వం క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. జిసిసి మోడల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా చేస్తుంద‌ని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఫ్లీట్‌కు ఎలక్ట్రిక్ బస్సులను మ‌రిన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సహా ఇత‌ర మంత్రులు అనేక సందర్భాల్లో ప్ర‌క‌టించారు. డీజిల్‌తో నడిచే కాలం చెల్లిన‌ బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్ర...
Telangana

Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్ర...
Exit mobile version