Maha Shivaratri Buses | మహా శివరాత్రి శ్రీశైలానికి 800, వేములవాడకు 700 ప్రత్యేక బస్సులు
Maha Shivaratri Buses | హైదరాబాద్: ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 3,000 ప్రత్యేక బస్సులను నడపనుంది.ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 43 శైవ క్షేత్రాలకు సేవలందించనున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 800 కి పైగా ఎక్కువ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు.
శ్రీశైలానికి (Srishailam) 800, వేములవాడకు 714, కీసరగుట్ట (keesaragutta) కు 270 , ఏడుపాయకు 444, వేలాలకు 171, కాళేశ్వరం(Kaleshwaram) 80, కొమురవెల్లికి 51 , ఇతర ప్రాంతాలకు మొత్తం 800 సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని ఎంజిబిఎస్(MGBS), జెబిఎస్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కెపిహెచ్బి, బి...