Saturday, March 1Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

Maha Shivaratri Buses | మ‌హా శివ‌రాత్రి శ్రీశైలానికి 800, వేముల‌వాడ‌కు 700 ప్ర‌త్యేక బ‌స్సులు

Telangana
Maha Shivaratri Buses | హైదరాబాద్: ఫిబ్రవరి 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 3,000 ప్రత్యేక బస్సులను నడపనుంది.ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 43 శైవ క్షేత్రాలకు సేవ‌లందించ‌నున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 800 కి పైగా ఎక్కువ‌ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. శ్రీశైలానికి (Srishailam) 800, వేములవాడకు 714, కీసరగుట్ట (keesaragutta) కు 270 , ఏడుపాయకు 444, వేలాలకు 171, కాళేశ్వరం(Kaleshwaram) 80, కొమురవెల్లికి 51 , ఇతర ప్రాంతాలకు మొత్తం 800 సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్(MGBS), జెబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కెపిహెచ్‌బి, బి...

Ration Card Updates | రేష‌న్ కార్డుల ద‌ర‌ఖాస్తుల‌పై స‌ర్కారు కీలక అప్ డేట్‌

Telangana
Ration Card Updates : రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవా కేంద్రాల వద్ద కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఆయా సెంటర్లు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశాల మేరకు తాము ఎలాంటి తుది గడువు విధించలేదని.. కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ, దరఖాస్తుదారులెవరూ ఇబ్బందులు పడొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. భారీగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన ప్రజాపాలన, కులగణన (Caste Census ) సర్వే సహా ...

TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?

Telangana
TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే డిమాండ్ తెర‌పై కి వ‌చ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌వ‌చ్చు. టికెట్ల విష‌యంలో తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని బీసీ సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్...

BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!

Telangana
Telangana BJP District Presidents list | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై బిజెపి ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది .గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిది సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాసిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. తాజాగా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల ఎంపిక పై రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది. Telangana BJP District Presidents list బిజెపి జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. హైదారాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్ మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్ మెదక్ – రాధా మల్లెష్ గౌడ్ వరంగల్- గంట రవి హన్మకొం...

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Telangana
హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే.. గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మా...

Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Telangana
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగ‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొన‌సాగుతుండ‌గా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆద...

EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

Telangana
TGSRTC EV Bus | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించే దిశ‌గా టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్య‌ను తెలంగాణ ప్రభుత్వం క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. జిసిసి మోడల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా చేస్తుంద‌ని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఫ్లీట్‌కు ఎలక్ట్రిక్ బస్సులను మ‌రిన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సహా ఇత‌ర మంత్రులు అనేక సందర్భాల్లో ప్ర‌క‌టించారు. డీజిల్‌తో నడిచే కాలం చెల్లిన‌ బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్ర...

Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Telangana
Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు. ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్ర...

Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Telangana
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో 'Me Time On My Metro' పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు. ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చ...

Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Andhrapradesh, Telangana
AP TG Sankranti Holidays 2025 : హైదరాబాద్: సంక్రాంతి ప‌ర్వ‌దినానికి సంబంధించి తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెలవులను ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ మంగ‌ళ‌వారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. కళాశాలలు తిరిగి 17న ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించొద్ద‌ని ఆదేశించింది. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి క్లాసులు నిర్వ‌హిస్తే చర్యలు తీసుకుంటామని ఇంట‌ర్‌ బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు వ‌చ్చాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై స్ప‌ష్ట‌త ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో ఈనెల 13న భోగి, 14న సంక్రాంతికి సెల‌వులు ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. భోగికి ముందు రో...
Exit mobile version