Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?
Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే 'కన్వర్ యాత్ర'కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'కన్వర్ యాత్ర' మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపులకు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించనుంది. అయితే కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు తమ స్థానిక దేవాలయాలలో సమర్పించడానికి పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు కుండలను మోసుకుంటూ కాలినడకన నడుస్తారు. ఈ సమయంలో వారు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉంటారు. అలాగే ఆహారంలో ఉల్లిపా...