మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు(Bengaluru) నగరాలను వందేభారత్ ఎక్స్ప్రెస్ అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. .
సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్పూర్ వందే భారత్ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 25 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
కాచిగూడ స్టేషన్లో జరిగే కార్యక్రమానికి ఈ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది.
రైలు నెంబరు 20703 కాచిగూడ - యశ్వంత్పూర్(Yeswantpur ) కాచిగూడ( Kacheguda )లో ఉదయం 5.30 గంట...