Wednesday, June 18Thank you for visiting

Tag: warangal

భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం

Local
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం సృష్టించిన వరద బీభత్సానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె వజ్రమ్మ (63) మహిళ గల్లంతు కాగా.. ఆమె మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించినట్లు భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గురువారం మోరంచపల్లి లో నలుగురు వ్యక్తులు గల్లంతు కాగా వాగు పరిసర ప్రాంతాల్లోని ఆయా గ్రామాల యువకులు, ప్రజల సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం రెండు మృతదేహాలు లభ్యం కాగా, ఆదివారం నేరెడుపల్లి సర్పంచ్, గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా.. నేరేడుపల్లి శివారు చిర్రకుంట చెట్ల పొదల్లో గొర్రె వజ్రమ్మ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఇంకా మరొక మృతదేహం కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడైనా మృతదేహాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ కోరారు. ...

వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..

Local
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదా...

భారీ వర్షాలతో తెలంగాణ విలవిల

Telangana
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం. మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని 'ఆరెంజ్' అలర్ట్  కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుప...

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

Local
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపు వరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీ...

భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం

Local
శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభం వరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి...

వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..

Telangana
దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ సుమారు 4వేల మందికి ఉపాధి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్లు, రెండో ఏడాది 2,400 వ్యాగన్లను తయారు చేస్తామని అ...
Exit mobile version