Wednesday, June 18Thank you for visiting

Tag: warangal

Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..

Trending News
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jatara) కు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ‘మై మేడారం యాప్‌’ (Medram app) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది భక్తులకు ఒక‌ గైడ్‌గా ఉప‌యోగ‌ప‌డనుంది. ఈ యాప్ సాయంతో జాతర ప‌రిస‌రాల్లోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్ర‌దేశాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు త‌దిత‌ర‌ వివరాలను తెలుసుకోవ‌చ్చు. అలాగే, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసే కేంద్రాలు, అగ్నిమాప‌క‌ కేం ద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ను ఈజీగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. కాగా నెట్వర్క్ లేకపోయినా ఈ యాప్ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క-సారలమ్మ మ‌హా జాతర జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఈసారి జాతరకు సుమారు కోటి 50 లక్షల మంది భక్తులు అమ్...

Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?

Special Stories
Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి.. ఆలయ చరిత్ర ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూ...

బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

Local
warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు. అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు..   వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ...

సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

Local, Telangana
కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యం Warangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ...

ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Local
Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు. ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ ల...

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Local
Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బు...

మొగిలిచర్ల లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల

Local
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ వరంగల్ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని చారిత్రక మొగిలిచర్లలో సోమవారం స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ మంత్రి,  హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద కేవలం 39 సంవత్సరాలు జీవించి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ధ్రువ వతారగా నిలిచారని అన్నారు. ప్రపంచ యువజన హృదయ సామ్రాట్ గా విరాజిల్లుతున్నారని తెలిపారు. యువత సన్మార్గంలో నడవాలంటే వివేకానంద చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. గ్రామంలో ఒకేసారి అబ్దుల్ కలాం, వివేకానంద విగ్రహావిష్కరణతో పాటు మతోన్మాది చేతిలో హత్యకు గురైన పూజారి దేవల సత్యనారాయణ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గొప్పవిషయమని, ఇది శుభ పరిణామమని కొనియాడారు. యువత సన్మార్గంలో ప్రయాణించి ఆదర్శ పురుషులుగా తయారు కావాలని ఆకాంక్షిం...

ఎన్నికల నియమాలపై అవగాహన ఉండాలి 

Local
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వరంగల్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని వరంగల్ జిల్లా పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హా లో రిటర్నింగ్ అధికారులు, నోడల్‌ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికలకు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్ బాషా, వర్ధన్నపేటకు సంబంధించి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీవో క్రిష్ణవేణి రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన వివిధ బాధ్యతల నిర్వహణ కోసం నియమించిన నోడల్‌ అధికారులకు వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, విధి విధానాలపై కలెక్టర్ వివిధ అంశాల వారీగా వివరించారు. జిల్లాలో ఎన్నికల విధుల ని...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

Local
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్లు బొక్క దయాసాగర్, వేముల నాగరాజు, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మసకపురి సుధాకర్, బొల్లారపు సదయ్యలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సభ్యుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ.. తుది జాబితాను రూపొందించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉన్న వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన కమిటీ..  అనుభవం ఉన్న జర్నలిస్టుల విషయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరించింది. తుది జాబితాకు సంబంధించిన భూ సేకరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సభ్యులకు తెలియజేశారు. వివిధ చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ జాగాలు చూసి ఫైనల్ చేసేందుకు మంత్రి, ఎంఎల్ఏతో కలసి ముందుకు సాగుతామని ప్రకటించింది. ...

నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు  

Local
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత వారోత్సవాల్లో భాగంగా కొత్తవాడ అమరవీరుల స్థూపం నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేతన్నలు నేసిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకులు గొప్పగా మార్చుకునేందుకేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధిచిన తెలంగాణలో ఆ ఫలాలను నేడు నేతన్నలకు అందుతున్నాయన్నార...
Exit mobile version