Wednesday, March 5Thank you for visiting

Tag: Vishakhapatnam

రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. పట్టాలెక్కనున్న రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులు..

Andhrapradesh
PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయ‌న‌ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గురువారం భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఇత‌ర ప్రాజెక‌ట్ఉల‌ను ప్రారంభించేందుకు. విశాఖపట్నం ప్రజలను క‌లుసుకునేందుకు తాను ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. NTPC గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన, నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కింద ఇటువంటి హబ్‌గా అ...

Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు…

Andhrapradesh
Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌యాణించేవారికి శుభ‌వార్త‌.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇకపై రాజధాని రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 5 గంటల్లోనే చేరుకోనున్నారు. ఇందుకోసం రైల్వే బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఇది డిసెంబర్ 2022 నుండి శనివారాలు మినహా వారానికి ఆరు రోజులు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ రైలు సేవ‌లందిస్తోంది. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు మార్గం బిలాస్‌పూర్-నాగ్‌పూర్ వందేభారత్ తర్వాత మ‌రో రెండో రైలును కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 15 న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప‌లు ...

Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..

Telangana
Vizag Vande Bharat Express | హైదరాబాద్‌ : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేవి. విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ...

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

Telangana
South central Railway | వేస‌విలో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మధ్య రైల్వే ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లోప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం వాసుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపించ‌నుంది. ఈ విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరు వెళ్లే రైలు ఏప్రిల్‌ 24, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉండ‌నుంది. అలాగే బెంగ‌ళూరు నుంచి విశాఖ‌ప‌ట్నం స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తీ ఆదివారం ఏప్రిల్ 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో అందుబాటో ఉంటుంది. ఈ రైలు దువ్వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, క‌ట్పాడి, జొలార్‌ప‌టాయి, క్రిష్ణార్జున‌పురం రైల్వేస్టేష‌న్ల‌లో హాల్టింగ్ సౌక‌ర్యంక‌ల్పించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌ల...

అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు

Andhrapradesh, Local
Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు. అయితే అతని మృతదేహాన్ని విశాఖ బీచ్ లో గుర్తింంచారు. కాగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అంతకుముదు కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు జూలై 19న ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని సంగా...

ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

Andhrapradesh, Local
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు. ఇది కూడా చదవండి:  ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..  Cafe Coffee Day విజయగాథ సంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆ...
Exit mobile version