Thursday, June 19Thank you for visiting

Tag: VHP

ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..

Trending News
VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్ర‌చారం చేప‌ట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత‌ ప్రచారాన్ని ప్రకటించింది. ఆల‌యాల‌ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం "ముస్లిం ఆక్రమణదారులు" మరియు "వలసవాద" బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు ప‌దవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ విలేఖరుల సమావేశంలో అన్నారు. "లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు "శుద్ధి కర్మలు" నిర్వహించనున్నామ‌ని ట‌ బోర్డు పేర్కొంది. ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ చేశారని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో 'మొత్తం హిందూ సమాజం ఆగ్రహం వ్య‌క్త‌మైంద‌ని జైన్ అన్నారు...

నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు..

National
Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం 'శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరించింది. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠినమైన చర్యలను తీసుకుంటోంది. పోలీసు అనుమతి నిరాకరించినప్పటికీ, విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపును నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నందున పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సెక్షన్ 144 విధించింది. నుహ్ జిల్లాలో ఎక్కడా గుమిగూడొద్దని ప్రజలను కోరింది. సెక్షన్ 144 విధింపు నుహ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అశ్విని కుమార్, జిల్లాలో సెక్షన్ 144 విధించినట్లు ప్రకటించారు. శోభాయాత్రకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, బ్యాంకులను మూసి వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. యాత్రను ప్రచారం చేసేవారు సెక్...
Exit mobile version