Vande Bharat | 20 కోచ్ లతో తొలి వందేభారత్ రైలు,.. ఈ రెండు నగరాల మధ్య పరుగులు..
Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవలేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆపరేషన్తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 1,440 సీట్లను కలిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి.
రైలు 8 గంటల్లో 771 కి.మీ
ఈ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు 20 కోచ్ల వందే భారత్ ...