Wednesday, June 18Thank you for visiting

Tag: Utter Pradesh

Kalindi Express | రైల్వే ట్రాక్ పై గ్యాస్‌ సిలిండ‌ర్‌.. ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పించే కుట్ర‌..!

Crime
UtterPradesh | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఎక్స్ ప్రెస్ రైలును కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌ట్టాలు త‌ప్పించేందుకు య‌త్నించారు. ఇందుకోసం పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఇదే స‌మ‌యంలో వ‌స్తున్న ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్  ( Prayagraj - Bhiwani Kalindi Express) సిలిండ‌ర్ ను ఢీకొన‌గా అది పాక్షికంగా ధ్వంస‌మై ప‌క్క‌కు జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాదం తప్పింది. దీనిని 'రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం'గా పోలీసులు పేర్కొన్నారు. కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ వద్ద కాళింది ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంతో గమ్యస్థానం వైపు వెళుతుండగా సిలిండర్‌ను ఢీకొట్టింది. ఎల్‌పిజి సిలిండర్‌ను పట్టాలపై ఉంచి కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించారు. రైల...

Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Trending News
Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adithynath) ను  పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భ‌ర్త ఒక్కసారిగా ఆగ్ర‌హించాడు. ఆపై వెంట‌నే ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే..  మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది.  పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న స‌ద‌రు మహిళ అక్క‌డి రోడ్లు, న‌గ‌ర అభివృద్ధి, చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీన...

Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌

Crime
Ayodhya Gangrape Case | లక్నో: అత్యాచార నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు మోయిద్ ఖాన్‌కు చెందిన అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అయోధ్య జిల్లా యంత్రాంగం నేల‌మ‌ట్టం చేసింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాన్ని కూల్చేందుకు మూడు బుల్‌డోజర్లు (bulldozers), ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. భారీ భద్రత నడుమ కూల్చివేతలు జరిగాయి. అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మోయిద్ ఖాన్ (65)ను అతని అసిస్టెంట్‌ రాజు ఖాన్‌తో పాటు జూలై 30న అరెస్టు చేశారు. అంతేకాకుండా, మైనర్ గ్యాంగ్‌రేప్ కు గురైన బాధితురాలు ఆగస్టు 7న లక్నోలోని ఓ హాస్పిటల్‌లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన తర్వాత, ప్రధాన నిందితుడు మొయిద్ ఖాన్ మరొక అక్రమ నిర్మాణ‌మైన 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బేక...

Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..

Crime
Shocking News | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra)లో మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి స్థానిక పంచాయతీ ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. పంచాయతీ సమావేశంలో ఒక మౌలానా ఈ అసాధారణ తీర్పును ప్రకటించారు. బాధితురాలి తరఫు ఓ మహిళ నిందితుడికి ఐదు చెంపదెబ్బలు కొట్టగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనికి సంబంధించిన‌ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒక పోలీసు అధికారి ప్రకారం.. బాధితురాలి కుటుంబం మొదట మైనర్ బాలిక అదృశ్యమైన‌ట్లు చెప్పారు. ఇందులో పొరుగున ఉన్న అబ్బాయి ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక తన ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యు...

సీఎం యోగీ మ‌రో సంచ‌ల‌నం.. అత్యంత‌ కఠినమైన ‘లవ్ జిహాద్’ బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక అంశాలు ఇవే..

Crime
Anti-Conversion Bill : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం, జూలై 30, UP చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను బలవంతపు మార్పిడులకు శిక్షను పెంచే బిల్లును ఆమోదించింది. ఒక మహిళను మోసం చేసి లేదా మతం మార్చి వివాహం చేసుకున్నందుకు ₹ 50,000 జరిమానాతో 10 సంవత్సరాల శిక్ష గతంలో ఉండగా  కొత్త బిల్లు  ప్రకారం ఇప్పుడు ఆ శిక్షను జీవిత ఖైదుగా  మార్చింది  చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను యాంటీ లవ్ జిహాద్ లా అని కూడా పిలుస్తారు. దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టగా మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాల్లో ఆమోదం ల‌భించింది. దోషులను శిక్షించే నిబంధనలను సవరణ కఠినతరం చేసింది. ఇప్పటికే ఉన్న‌ నేరాలకు శిక్షను పెంచారు. సవరణలోని నిబంధనలు ఏమిటి? సవరించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, వివాహం చేసుకున్నా లేదా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా లేదా అందుకోసం కోసం ...

Kanwar Yatra | కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

Trending News
Kanwar Yatra eateries row : కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల షాపుల‌ యజమానుల పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం (జూలై 22) మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. 'వెజ్ లేదా నాన్ వెజ్' ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణ యజమానులను కోర్టు ఆదేశించింది. Kanwar Yatra : న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానాలు కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లను ప్ర‌ద‌ర్శించాల‌ని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి సుప్రీంకోర్టు ఖరారు చేసింద...

PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

National, తాజా వార్తలు
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధుల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు. ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని రూ. 2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్...

Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

National, తాజా వార్తలు
Ayodhya on high alert  | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్‌గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని ప్రతిస్పందనగా, భద్రత, నిఘా చర్యలు ప‌టిష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు. 2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్రవాదుల దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ ...

కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

National, తాజా వార్తలు
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ త‌ర్వాత‌ వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నిక‌ల్లో పోటి చేయ‌నున్న‌ట్లు వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయ‌లేదు. గ‌తంతో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె యూపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తన మనసులో మాట బయటపెట్టారు.. కానీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌లేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ యూపీలోని రాయ్ బ‌రేలీ, కేర‌ళ‌లోని వాయ‌నాడ్ రెండు సీట్లల్లో పో...

Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్‌ తలాక్‌.. ఆ త‌ర్వాత ఏమైంది.. ?

Viral
లక్నో: ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ (Triple Talaq) చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో రైలు నిల‌వ‌గానే భార్యపై దాడి చేసి ప‌రార‌య్యాడు. దీంతో ఒక్క‌సారిగా కంగుతిన్న ఆమె త‌న‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 28 ఏళ్ల మహ్మ‌ద్ అర్షద్‌.. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఒక‌ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మ్యాట్రిమోనియల్ ప్రకటన ద్వారా కోటాకు చెందిన 26 ఏళ్ల అఫ్సానాతో ప‌రిచ‌మ‌య్యింది. వీరిద్ద‌రూ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వివాహం చేసుకున్నారు. కాగా, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రాయన్ లో అర్షద్ బంధువుల ఇంటికి అర్ష‌ద్ అఫ్సానా వెళ్లారు. ఈ సందర్భంగా అర్షద్‌కు అప్పటికే వివాహమైనట్లు అఫ్సానా తెలుసుకుని షాక్ అయింది. దీంతో వెంట‌నే అత‌డిని నిల‌దీయ‌గా అర్షద్‌, అతడి తల్లి కలిసి అఫ్సానాపై దాడికి దిగారు. ఆపై వరకట్నం కోసం అఫ్సా...
Exit mobile version