Thursday, June 19Thank you for visiting

Tag: Uttarakhand

UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత

National
ఉత్తరాఖండ్‌లో అక్రమ మదర్సాలపై ప్రభుత్వం కన్నెర్ర UttharaKhand : ఉత్తరాఖండ్‌లో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. మతమార్పిడి అయినా, లవ్ జిహా ద్ అయినా, ల్యాండ్ జిహాద్ అయినా, స్పిట్ జిహాద్ అయినా లేదా ఇటీవల చర్చకు దారితీస్తున్న మదర్సా జిహాద్ అయినా, పుష్కర్ దామీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన, నిర్ణయాత్మక చర్య తీసుకుంటోంది. రాష్ట్రంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తాజాగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో, ప్రభుత్వం ఇప్పుడు చట్టవిరుద్ధంగా, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న మదర్సాలపై యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు, రాష్ట్రవ్యాప్తంగా 170 కి పైగా మదర్సాలను సీల్ చేశారు, అవి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయన...

Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్

Crime
cylinder on the railway tracks : ఉత్తర‌ఖండ్ లో మ‌రో రైలు ప్ర‌మాదానికి దుడ‌గులు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉద‌యం 6:35 గంట‌ల‌ సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా - ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి పంపించి ప‌రిశీలించ‌గా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్‌ మాస్టర్‌ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులక...

Kanwar Yatra | కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

Trending News
Kanwar Yatra eateries row : కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల షాపుల‌ యజమానుల పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం (జూలై 22) మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. 'వెజ్ లేదా నాన్ వెజ్' ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణ యజమానులను కోర్టు ఆదేశించింది. Kanwar Yatra : న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానాలు కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లను ప్ర‌ద‌ర్శించాల‌ని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి సుప్రీంకోర్టు ఖరారు చేసింద...

Char Dham Yatra schedule | భక్తుల కోసం తెరుచుకున్న చార్ ధామ్ యాత్ర, షెడ్యూల్ ఇదే..

Trending News
Char Dham Yatra | ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్ర హిందువులకు పవిత్రమైనంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం అసంఖ్యాక‌మైన భ‌క్తులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. యమునోత్రి (Yamumotri), గంగోత్రి (Gangotri), కేదార్‌నాథ్, బద్రీనాథ్ (Badrinath) పుణ్యక్షేత్రాలను తిల‌కించేందుకు దేశంలోని న‌లుమూల‌ల నుంచి వ‌స్తుంటారు. కాగా కేదార్‌నాథ్ (Kedarnath), గంగోత్రి యమునోత్రి ఆలయాలు శుక్రవారం భక్తుల కోసం తెరవబడ్డాయి. గర్హ్వాల్ హిమాలయాలలో నెలకొని ఉన్న ఈ ఆలయాలు ఏటా మంచు దుప్పట్లు కప్పివేస్తాయి. వేసవి రాకతో మాత్రమే తిరిగి తెరవబడతాయి. Char Dham Yatra షెడ్యూల్ .. Char Dham Yatra schedule  : ఆలయ కమిటీ అధికారులు రీ ఓపెన్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు ఉదయం 7 గంటలకు తెరవనుండ‌గా, గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుస్తారు. ఉత్తరాఖండ్ 'చర్ధమ్ యాత్ర'లో భాగమైన బద్రీనాథ్ మే 12వ తేదీన‌ ఉదయం 6 గంటలకు తెర...

Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

National
Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథుడికి ఆదివారం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభ‌య్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజ‌లు జ‌రిపారు. గత ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించారని ఆలయ క‌మిటీ ప్ర‌తినిధులు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా భక్తుల రద్దీ పెరిగే అవ‌కాశ‌ముంది. ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ చేరుకుని యాత్రకు ముందస్తు ఏర్పాట్లలో నిమ‌గ్న‌మైంది. కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నదికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. 2013లో సంభవించిన ఆకస్మిక ...

ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు

Trending News
ఓ పోలీసు అధికారి ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఏకంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. ఉత్తరఖండ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ కోట్‌ద్వార్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించాడు. అదే సమయంలో కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుండి దిగగానే, కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనకు సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో పై అధికారులు తక్షణమే స్పందించారు. ASPని నరేంద్ర నగర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు. ఈ సంఘటన ...
Exit mobile version