Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేతనాల నిలిపివేత
Uttar Pardesh | ఆన్లైన్లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆన్లైన్లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని కారణంగా వారి వేతనాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంలో 2,44,565 మంది ఉద్యోగులు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు అందుకోలేదు. శాఖల నివేదికల ఆధారంగా ఈ ఉద్యోగులందరికీ ఆగస్టు నెల జీతాలు నిలిపివేశారు. ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 31 లోపు రాష్ట్ర ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను మానవ సంపద పోర్టల్ (Manav Sampada Portal )లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, సమాచారం ప్రకారం, 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఈ సమాచారాన్ని అప్లోడ్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, పీపీఎస్, పీసీఎస్ అధికారుల తరహాలో రాష్ట్ర ఉద్యోగులు ఆన్లైన్లో ఆస్తుల వివరాలను తెలియజేయడం తప్పనిసరి చేశారు.
జీతం ఎందుకు ఆగిపోయింది?
ఉత్తరప్రదేశ్ (Uttar Pardesh)లో...