Thursday, June 19Thank you for visiting

Tag: Uniform Civil Code

Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమ‌లు దిశ‌గా ఉత్తరఖండ్..

Trending News
Uttarakhand | యూనిఫాం సివిల్ కోడ్ ను అమ‌లు చేసేందుకు ఆ రాష్ట్రం సిద్ధ‌మ‌వుతోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవ‌లే విస్తృత చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించింది. అనంత‌రం క‌మిటీ త‌న‌ సిఫార్సులను బుక్‌లెట్ రూపంలో ముఖ్యమంత్రికి అందించేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం లభిస్తే నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, ఉత్తరాఖండ్ సిఎం ధామి నవంబర్ 9 నాటికి రాష్ట్ర 24వ ఆవిర్భావ దినోత్సవంతో యుసిసిని అమలు చేయనున్న‌ట్లు గ‌త‌లోనే ప్రకటించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో యూసీసీ (Uniform Civil Code) బిల్లును ఆమోదించింది. రాష్టప‌తి ద్రౌపది ముర్ము మార్చి 13న దానిపై సంతకం చేశారు, UCCని అమలులోకి తెచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించడానికి మార్గం సుగమం చేసింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ ...

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్

National
BJP Manifesto 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వేదికపై బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జెపి నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా విక్షిత్ భారత్ సాధనపై దృష్టి కేంద్రీకరించామని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని ఇళ్లకు పైపులైన్ ద్వారా ఎల్పీజీ గ్యాస్, సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ అందించనున్నామని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తిపై దృష్టి సారిస్తుందని, ధరలను స్థిరీకరించడానికి , పేదల కోసం ఆయుష్మాన్‌ ...

జూలై 27 నుంచి బీజేపీ ‘పస్మాండ సంవాద్’

National
దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం ఉద్దేశమేంటీ? యూనిఫాం సివిల్ కోడ్ చుట్టూ చర్చ కొనసాగుతుండగా.. భారతీయ జనతా పార్టీ ముస్లిం సమాజానికి చేరువయ్యే మార్గాలను అన్వేషిస్తోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) జయంతిని పురస్కరించుకుని ముస్లింలకు చేరువయ్యేందుకు పార్టీ మైనారిటీ విభాగం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. జూలై 27 నుంచి ఢిల్లీలో 'పస్మాండ సంవాద్' (Pasmanda Samvad) ను ప్రారంభించనుంది. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి అయిన అక్టోబర్ 15 న ముగుస్తుంది. ఢిల్లీ నుండి ప్రచారం మొదలై ఉత్తరాఖండ్‌కు చేరుకుంటుంది. ఆపై ఉత్తరప్రదేశ్‌లో వారణాసి, బీహార్‌లో నిరంతర ప్రచారం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా ప్రచారం నిర్వహించి హర్యానాలో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ...
Exit mobile version