Monday, March 3Thank you for visiting

Tag: TSRTC

Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?

Telangana
Telangana Free Bus Service : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే డిమాండ్ కు తగినట్లుగా  ఎక్స్‌ప్రెస్‌ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) పెంచడం లేదు. దీంతో బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఒకవేళ బస్సులు వచ్చినా అవి పూర్తిగా జనంతో నిండిపోయి కనీసం నిలబడి ప్రయాణించే వీలు కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు గత్యంతరం లేక   డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళలను డీలక్స్‌ బస్సులవైపు వారిని మళ్లించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మహిళలను డీలక్స్ బస్సులవైపు ఆకర్షించేందుకు  తాజాగా డీలక్స్‌ బస్సు (Deluxe Bus ) ఎక్కితే వారికి  బహుమతులు ఇస్తామంటూ కొ...

Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..

Crime, Telangana
Attack on RTC bus | హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై  వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. అయితే ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ బస్సులపై ఎలాంటి కారణం లేకుండా దండగులు దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదనిఅన్నారు. ఆర్టీసీ బస్సుపై దాడిని తాము  తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పోలీసులు దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్...

Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..

Telangana
Maha Shivaratri : శివరాత్రి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించేవదుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం (vemulawada temple) లో మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో టీఎస్ ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపనుంది. వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల కోసం 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ అధికారులు వెల్లించారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9వ తేదీన 329 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు వరం...

Mahalaxmi Scheme | రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..  ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు త‌ర‌హాలో సీట్లు

Telangana
mahalaxmi scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ఆరు హామీల్లో భాగంగా మొట్టమొదటసారిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప‌థ‌కం కింద మహిళలందరికీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించారు. దీంతో అన్ని బస్సుల్లో ఒక్క‌సారిగా రద్దీ పెరిగింది. మహిళలందరూ ప్రైవేట్ వాహనాల‌ను వ‌దిలి బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బ‌స్సుల్లో ఎక్కువ మంది ప్ర‌యాణికులు పట్టేలా ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైళ్లలో మాదిరిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసేందుకు చ‌ర్య‌లు చేపట్టారు. Mahalaxmi Scheme  ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది జ‌ర్నీ చేయ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండు వైపులా మెట్రో రైలులో మాదిరిగా సీట్ల‌ను ఏర్పాటు చేశారు. ఫలితంగా మధ...

TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే చెల్లదు..

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గు ర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొంది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ ఐడీ కార్డైన ఈ పథకానికి వర్తిస్తుందన్నారు.  అయితే పాన్‌ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లు, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ కాపీలు చూపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడుతుండడంతోపాటు ప్రయాణ సమయం కూడా పెరుగు తున్నది.  దీం...

RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..

Andhrapradesh, Telangana
సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు.. RTC Special Buses: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి ప్రయాణికుల సంఖ్య  భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే పండుగ వేళ టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) ను పురస్కరించుకొని  ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఆన్ లైన్ టికెట్లు (online tickets ) బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ( RTC Special Buses ) ఉంటుందా?  అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.. సంక్రాంతి పండుగకి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ...

TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు

Telangana
TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. TSRTC New Buses  ఇందులో 400 ఎక్స్ ప్రెస్ ‌ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, తోపాటు 56 ఏసీ రాజధాని బస్సులను కొనుగోలు చేయనుంది. అలాగే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ నగరంలో 540, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 500 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలుచేపడుతుంది. ఈ కొత్త బస్సులన్నీ పలు విడుతల వారీగా వచ్చే సంవత్సరం మార్...

Mahalakshmi Free Bus Scheme | ఎక్స్ ప్రెస్‌ బస్సులు ఎక్కే మహిళలకు టీఎస్ ఆర్టీసీ కీలక సూచన

Telangana
Mahalakshmi Free Bus Scheme | మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఒక కీలక సూచన చేసింది. తక్కువ దూరం ప్రయాణించాల్సిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బంది,తోటి ప్రయాణికులకు సహకరించాలని ఆయన కోరారు. Mahalakshmi Free Bus Scheme అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీ ల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతుందని తెలిపారు. అందుకే ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతామని వెలిపారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్...

‘సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

National
ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన ఇదీ.. TS RTC Mahalaxmi Scheme | హైదరాబాద్: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఉచిత సర్వీస్ అమలు అవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లో రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఆర్థికంగా తమకెంతో ప్రయోజనం కలుగుతోందని చెబుతున్నారు. అయితే, ఇదే పథకం వల్ల తాము పడరాని పట్లు పడుతున్నామని, తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు గగ్గోలు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.. 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా..?' అని ప్రశ్నించాడు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారని, ...

టీఎస్ ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీలు త‌గ్గింపు..! 

Andhrapradesh
విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. TSRTC E-Buses : హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ ఎలక్ట్రిక్ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎం.డీ వీసీ స‌జ్జ‌నార్ వెల్లడించారు.. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఈ-గ‌రుడ బ‌స్సు ఛార్జీల‌ను తగ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫ‌ర్ నెల రోజుల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంద‌న్నారు. మియాపూర్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజ‌య‌వాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి త‌గ్గించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. ...
Exit mobile version