Railways news | ప్రయాణికులకు గమనిక.. ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు…!
Cancellation OF Trains | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్.. నిడదవోలు-కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను ముమ్మరం చేసింది. దీంతో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. గుంటూరు-విశాఖ ( సింహాద్రి), విశాఖ-లింగంపల్లి (జన్మభూమి), విజయవాడ-విశాఖ (రత్నాచల్), గుంటూరు-విశాఖ (ఉదయ్), విశాఖ-తిరుపతి (డబుల్ డెక్కర్), గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్ను ఎగువ దిగువ మార్గాల్లో రద్దయ్యాయి.
రద్దయిన రైళ్లు ఇవే..
జూన్ 24 నుంచి ఆగస్టు 10 వరకు
రాజమండ్రి – విశాఖ (07466) ప్యాసింజర్,
విశాఖ-రాజమండ్రి (07467) ప్యాసింజర్,
గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి,
విశాఖ- గుంటూరు (17240) సింహాద్రి,
విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ప్రెస్,
విశాఖ- విజయవాడ (12717) రత్నాచ...