Thursday, June 19Thank you for visiting

Tag: train accident

Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్‌

Crime
Bengal Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (West Bengal train derailment) కు చెందిన టి హ్రీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లలో పార్శిల్ వ్యాన్, B1 ప్యాసింజర్ కోచ్ ఉన్నాయి. నల్పూర్ స్టేషన్‌లో రైలు మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతుండగా పట్టాలు తప్పినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓంప్రకాష్ చరణ్ తెలిపారు. "ఈ ఉదయం, 5.30 గంటలకు, 22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ నల్పూర్ రైల్వే స్టేషన్‌లో మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు వెళుతుండగా పట్టాలు తప్పింది. ఇందులో ఒక పార్శిల్ వ్యాన్, రెండ...

Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం

National
Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జ‌రిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర ప‌న్నిన‌ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగింది. సోలాపూర్‌ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్‌ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంట‌నే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్‌ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. విష‌యం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో..  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆదివారం భివాండి-ప్రయాగ్‌రాజ్‌ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలుప‌ట్టాల‌పై కొంద‌రు దుండ‌గులు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచారు. లోకో పైలెట్ గ‌మ‌నించి ఎమ‌ర్జెన్సీ బ్రే...

Howrah-CSMT Express : ప‌లు రైళ్లు రద్దు.. మరికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు పూర్తి జాబితా ఇదే..

తాజా వార్తలు
Howrah-CSMT Express  | జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ సమీపంలో మంగళవారం (జూలై 30) తెల్లవారుజామున హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో అనేక రైళ్లు మళ్లించాల్సి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న ఈ రైలు ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.45 గంటలకు పట్టాలు తప్పింది. రద్దు అయిన‌ రైళ్ల జాబితా: 22861 హౌరా-కాంతబాజీ ఎక్స్‌ప్రెస్ 08015/18019 ఖరగ్‌పూర్-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ 12021/12022 హౌరా-బార్బిల్ ఎక్స్‌ప్రెస్ షార్ట్ టర్మినేట్ చేసిన రైళ్లు.. 18114 బిలాస్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్ రూర్కెలాలో దారిమ‌ళ్లింపు 18190 ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్‌ను చక్రధర్‌పూర్ వ‌ర‌కు ప‌రిమితం చేశారు. 18011 హౌరా-చక్రధర్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగ్రా వ‌ర‌కు ప‌రిమితం. హెల...

Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Trending News, తాజా వార్తలు
Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం మరియు 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయని, మరిన్ని వైద్య బృందాలు అంబులెన్స్‌లను అక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు. రైల్వే సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైలుప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు ₹ 10 లక్షల ఎక్స్‌...

Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్‌లు.. ప‌లువురు మృతి

National
Dibrugarh-Chandigarh Express | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్‌ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15904) ప‌ట్టాలు త‌ప్పి (Train Accident ) అనేక కోచ్‌లు ప‌డిపోయాయి. రైలు దిబ్రూగఢ్‌కు వెళ్తుండగా జిలాహి రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో నాలుగు ఏసీలతో సహా రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్‌ను ఘటనాస్థలికి పంపారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక పరిపాలనకు సహాయం చేయడానికి ఆర్మీ సిబ్బందిని పంపించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోవాలని అధికారులను ఆ...

kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?

Special Stories
kavach technology | ఒకే లైన్‌లో ఒకే సమయంలో రెండు రైళ్లు ప్రయాణిస్తే ఒక‌దానికొక‌టి ఢీకొన‌కుండా ఉండేందుకు పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థనే ఈ కవాచ్.. అయితే ఈరోజు ప‌శ్చిమ బెంగ‌ల్ డార్జిలింగ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ట్రాక్‌లపై ఈ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ అందుబాటులో లేదు. కోల్‌కతాకు వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే గ‌తంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కవాచ్ సిస్టమ్‌ గురించి వివరిస్తున్న పాత వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఈ వ్యవస్థను ఇంకా చాలా రైలు నెట్‌వర్క్‌లో ఇన్‌స్టాల్ చేయలేదని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 6,000 కి.మీ ట్రాక్‌లను కవర్ చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ-గౌహతి మార్గంలో భద్రతా వ్యవస్థను అమలు చేయాలని భార‌తీయ‌ రైల్వే యోచిస్తోంది. బెంగాల్ ఈ ఏడాది కవ...

ఒడిశా రైలు ప్రమాద మృతులకు రూ.5లక్షల పరిహారం

National
odisha train tragedy : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 288 మంది మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. చెన్నై వైపు వెళ్తున్న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై గూడ్స్ రైలును ఢీకొట్టింది, దీనివల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక క్యారేజ్ మూడవ ట్రాక్‌పైకి వెళ్లింది. మూడో ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లింది. కారణం గుర్తించాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన  రైలు ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించామని, అయితే అది ఏమిటో వెల్లడించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను స్వాధీనం చే...
Exit mobile version